‘ఇక వార్ వన్సైడే.. మనమే గెలుస్తున్నం. ఎలాంటి ఆందోళన లేదు. ఈ పద్మాదేవేందర్రెడ్డిని ఆదరించండి.. అండగా ఉండి మీకు అన్నివిధాలా సేవచేస్తా.. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే మనం అధోగతి పాలవుతాం. 13 ఏండ్లుగా మైనంపల్లి మెదక్ ప్రాంత ప్రజలకు ఏం చేసిండు’.. అని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ పట్టణం లోని పిల్లికోటాల్, రామాయంపేటలోని డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ, ఎస్సీ కాలనీల్లో ఆమె ప్రచారం చేశారు. రామాయంపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో ముందుగా ఎస్సీ కాలనీకి చేరుకుని రోడ్షో నిర్వహించారు.
రామాయంపేట/మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 27: పేదల సొంతింటి కల నిజం చేసింది సీఎం కేసీఆర్ అని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ పట్టణంలోని పిల్లికోటాల్, రామాయంపేటలోని డబుల్బెడ్రూం, ఎస్సీ కాలనీల్లో ఎన్నికల ప్రచారం చేశారు. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు, పోచమ్మ గుడి వద్ద పూజలు చేశారు. రామాయంపేటలోని రోడ్డు పొడవునా వేలాదిగా ప్రజలు పద్మాదేవేందర్రెడ్డికి బ్రహ్మరథం పట్టి, పూలవర్షం కురిపించారు. పట్టణ మహిళలతో కలిసి పద్మారెడ్డి దాండియా ఆడారు. పద్మాదేవేందర్రెడ్డి రావడంతో యువకులు, వార్డు కౌన్సిలర్లు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ పేదవారు ఇల్లు కలిగి ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నారన్నారు. పిల్లికోటాల్లో 12 వందల డబుల్ బెడ్రూమ్లు నిర్మించారన్నారు. మరోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థలం గల వారికి ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు సాయం అందజేస్తామన్నారు. 13 ఏళ్ల కింద ఎమ్మెల్యేగా కనిపించిన వ్యక్తి ఇప్పుడు తన కొడుకు కోసం మెదక్ టికెట్ను ఆశించి, భంగపడి అప్పటికప్పుడే కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకుని ఓట్ల కోసం వస్తుండన్నారు.
డబ్బు తీసుకుని టికెట్ ఇచ్చిన గజదొంగ రేవంత్రెడ్డి అని మండి పడ్డారు. నాయకుల మోసపూరితమైన మాటలు నమ్మొద్దన్నారు. మైనంపల్లి హన్మంత్రావు మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడి సమస్యలపై ఒక్కసారైన అసెంబ్లీలో లేవనెత్తలేదన్నారు. ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. అనంతరం నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతు పదేండ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి కిందిస్థాయి నుంచి కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తే నేడు డబ్బుకు అమ్ముడుపోయి టికెట్టు ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. గడ్డికి వడ్లకు తేడా తెలియని రోహిత్ ప్రజలకు న్యాయం చేస్తాడా అని ప్రశ్నించారు. పద్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం బీఆర్ఎస్ సత్తా చాటుదామన్నారు. రామాయంపేట ప్రచారంలో పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగరి, పీఏసీఎస్ చైర్మ్ బాదె చంద్రం, పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, రామాయంపేట మాజీ సర్పంచ్ పాతూరి ప్రభావతి, కౌన్సిలర్లు దేమె యాదగిరి, మల్యాల కవిత, సుందర్సింగ్, బొర్ర అనిల్, చంద్రపు శోభ, చింతల రాధా భవాని, చిలుక గంగాధర్, బొర్ర అనిల్ తదితరులు ఉన్నారు.