పాపన్నపేట, నవంబర్9: కాంగ్రెస్కు ఓటు వేస్తే కరెంట్ కష్టాల పాలవుతామని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ముద్దపూర్, రామతీర్థం, నార్శింగిరావు పల్లి తండా, మొదల్లకుంట తండా, కందిపల్లి, అమ్రియా తండా, పాత లింగాయి పల్లి, చీకోడ్, కొంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్మెంట్ భూముల నిబంధనలను సులభతరం చేసి భూ హక్కులు కల్పిస్తామన్నారు. తండాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న లక్ష్యంతోనే గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు.
పోడు భూములకు సైతం భూ హక్కులు కల్పించామన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతు బంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా గెలవలేరన్నారు. కాంగ్రెస్లో ఎప్పటికీ కుర్చీల కొట్లాట ఉంటుందన్నారు. గతంలో గెలిచిన మైనంపల్లి మెదక్ వద్దు హైదరాబాద్ ముద్దు అని వెళ్లి, మళ్లీ 13 ఏళ్లకు మెదక్ నియోజకవర్గానికి కొడుకును తీసుకొచ్చారన్నారు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మవద్దని, నమ్మితే నట్టేట ముంచుతారని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఆమె వెంట మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, జిల్లా రైతు కమిటీ అధ్యక్షుడు సోములు, పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కుమ్మరి జగన్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్లు గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి, దానయ్య, నవీన్, రాణి కిష్టయ్య, విజయ తిరుపతిరెడ్డి, స్రవంతి శ్రీనివాస్, సబితా రవీందర్, పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, డైరెక్టర్లు మనోహర్, వెంకటేశం, సాయిలు, పెంటయ్య, నాయకులు దుర్గయ్య, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.