పాపన్నపేట, నవంబర్ 21: 11 సార్లు గెలిచి 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ కరెంటు కష్టాలనే మిగిల్చిందని, కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కరెంట్ కష్టాల పాలవుతామని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలంలోని యూసూఫ్పేట, ఆరెపల్లి, కుర్థివాడ, దౌలాపూర్, మిన్పూర్, మల్లంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో కేవలం ఏడు గంటల కరెంట్ మాత్రమే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు మళ్లీ తప్పవని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్మెంట్ భూముల నిబంధనలను సులభతరం చేసి భూ హక్కులు కల్పిస్తామన్నారు. పోడు భూములకు సైతం భూ హక్కులు కల్పించనున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతుబంధు, పంట రుణమాఫీ ఆపాలని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా గెలువలేరన్నారు.
కాంగ్రెస్లో ఎప్పటికీ కుర్చీల కొట్లాట ఉంటుందన్నారు. గతంలో మెదక్ నుంచి గెలిచిన మైనంపల్లి 13 ఏండ్లుగా మెదక్ నియోజకవర్గాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఆయన కేవలం గిన్నెలు, గ్లాసులు ఇచ్చిండని, నీళ్లు లేనప్పుడు బోర్లు ఎందుకు వేయలేదని, ఇప్పుడేందుకు వేస్తున్నాడని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీల మాటలు నమ్మితే నట్టేట మునుగుతామన్నారు. కేపీఆర్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఆమె వెంట మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కుమ్మరి జగన్, జిల్లా రైతు కమిటీ అధ్యక్షుడు సోములు, పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, రైతు సమన్వయ సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు దాసు, శ్రీనాథ్ రావు, స్రవంతి శ్రీనివాస్, లింగారెడ్డి, దానయ్య, నవీన్, రాణి కిష్టయ్య, విజయతిరుపతి రెడ్డి, పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, ఏడుపాయల మాజీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, డైరెక్టర్లు శివశంకర్, మనోహర్, వెంకటేశం, సాయిలు, పెంటయ్య, నాయకులు దుర్గయ్య, సాయిరెడ్డి, కిష్టారెడ్డి, రఘు, భూషణం, గోపాల్, లక్ష్మాగౌడ్, ఉస్మాన్ గౌడ్, వెంకటేశం ఉన్నారు.