మెదక్ మున్సిపాలిటీ, జూలై 4: జిల్లా కేంద్రమైన మెదక్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మంగళవారం ఉదయం సుడిగాలి పర్యటన చేశారు. స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనులను పురోగతిని పరిశీలించారు. ముందుగా నీటిపారుదల శాఖ కార్యాలయ ఆవరణలో రూ.4.50 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పరిశీలించారు. అనంతరం రూ.2 కోట్లతో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులు, రూ.20 లక్షలతో నిర్మిస్తున్న ఏనిమిల్ బర్త్ కేర్ కేంద్రం నిర్మాణ పనులు, రాందాస్ చౌరస్తాలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెర్స్ పనులను పరిశీలించారు. వాన కాలం వచ్చినందున పనుల్లో వేగం పెంచాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనర్ జానకీరామ్సాగర్, డీఈ మహేశ్కు సూచించారు.
ఎనిమిల్ బర్త్ కేర్ కేంద్రం పనులను 20 రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. వైకుంఠధామం నిర్మాణంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. స్థలం సరిగా లేదని, వానలు కురుస్తే నీరు చేరే అవకాశమున్నదని, వాన నీరు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో ప్రారంభానికి సిద్ధంగా గల రైతుబజార్ను సందర్శించారు. అనంతరం రూ.15 లక్షలతో చేపట్టిన ప్రెస్క్లబ్ భవనంలోని పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేవెంట మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, తహసీల్దార్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ రాగి అశోక్ కౌన్సిలర్లు జయరాజ్, శ్రీనివాస్, ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ పెర్క కిషన్, ఆత్మకమిటీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి సతీశ్, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, శివరామకృష్ణ, అరవింద్గౌడ్, శంకర్, కొండ శ్రీనివాస్, మోచి కిషన్, బాలరాజు, మున్సిపల్ ఏఈ బాలసాయగౌడ్, టెక్నికల్ ఇన్స్పెక్టర్ సలీం, వర్స్ ఇన్స్పెక్టర్లు దుర్గాపతి, పోచయ్య తదితరులున్నారు.