జహీరాబాద్, నవంబర్ 27: ముస్లింలు, లింగాయత్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని, రానున్న రోజుల్లో వారికి అన్నివిధాలుగా ఆదుకుంటామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ఝరాసంగం, జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలు, సమ్మేళనాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. జహీరాబాద్ ఎమ్మెల్యేగా బాగారెడ్డి పోయి..గీతారెడ్డి వచ్చినా వారి పాలనలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమం జరగలేదని అన్నారు. జహీరాబాద్ అభివృద్ధిలో మార్పు తీసుకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు. ప్రతి ఇంటికీ మంచినీళ్లు అందిస్తున్నామని, కరెంట్ సమస్య పరిష్కరించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాణిక్రావును గెలిపిస్తే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారు.మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలు అమలు చేస్తామన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అర్హులైన మరో 6వేల మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. జహీరాబాద్ సర్కార్ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
జహీరాబాద్ ఎమ్మెల్యేగా మాణిక్రావును భారీ మెజార్టీతో గెలిపిస్తే ఝరాసంగంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, బీఆర్ఎస్ నాయకుడు నరేశ్ జూనియర్ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారని, వారి విజ్ఞప్తి మేరకు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు.
లింగాయత్ సమాజ్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. హైదరాబాద్లో ట్యాంక్బండ్పై బసవేశ్వర్ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్లో లింగాయత్ భవన నిర్మాణానికి స్థలం ఇచ్చి నిధులు మంజూరు చేశామన్నారు. జహీరాబాద్ పట్టణంలో లింగాయత్ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, హుగ్గెల్లి చౌరస్తాల్లో బసవేశ్వర్ విగ్రహం ఏర్పాటుకు నిధులు మంజూరు చేశామన్నారు. లింగాయత్లు శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లు వేసి మాణిక్రావును అధిక మెజార్టీతో గెలిపించాలని హరీశ్రావు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభు త్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కుమారుడు తన్వీర్కు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇచ్చామన్నారు. భవిష్యత్లో మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. జహీరాబాద్ పట్టణంలో ముస్లిం షాదీఖాన, హౌజ్హస్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. ముస్లిం విద్యార్థులు చదువుకోవడానికి మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. మైనార్టీలు బీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు.
అసైన్డ్ భూములు ఉన్న రైతులకు పట్టాలు ఇచ్చి, పూర్తి హక్కు లు కల్పిస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. మాల సామాజిక వర్గానికి చెందిన గోటిగార్పల్లి భూమయ్యకు ఎన్నికల్లో గెలిచిన వెంటనే మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమిస్తామన్నారు. జహీరాబాద్లో నియోజకవర్గంలో బుద్ధవిహార్కు భూమి ఇస్తామన్నా రు. ఎన్నికల్లో మాల సామాజిక వర్గం వారు కారు గుర్తుకు ఓట్లు
సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, బేవరేజ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, టీఎస్డీసీ చైర్మన్ తన్వీర్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, రైల్వేబోర్డు సభ్యుడు షేక్ ఫరీదు, టెలికాం బోర్డు సభ్యుడు పవార్ శంకర్నాయక్, బీఆర్ఎస్ ఝరాసంగం మండలాధ్యక్షుడు వెంకటేశం, జహీరాబాద్ మండలాధ్యక్షుడు తట్టు నారాయణ, నాయకులు జి.గుండప్ప, సుభాశ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, గోటిగార్పల్లి భూమయ్య, జనార్దన్, శంకర్ పాటిల్, నామ రవికిరణ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఝరాసంగంలో పుట్టి పెరిగిన ఎమ్మెల్యే మాణిక్రావు మీ లోకల్ బిడ్డ అని, ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. మాణిక్రావు గెలిస్తే జహీరాబాద్ ఎమ్మెల్యే ఝరాసంగానికి చెందిన వ్యక్తి అంటారని, అదే కాంగ్రెస్కు ఓటేస్తే వికారాబాద్ వ్యక్తి అవుతాడన్నారు. స్థానిక వ్యక్తిని ఆశీర్వదించి ఝరాసంగం మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి రాగానే 5 గ్యారెంటీలు అటకెక్కించిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. హామీల అమలులో అక్కడి సర్కారు విఫలమైందన్నారు. కర్ణాటకలో వ్యవసాయానికి 5గంటల కరెంట్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. కర్ణాటక దుస్థితి మన తెలంగాణలో రావద్దని మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధు పంపిణీని నిలిపివేసి కాంగ్రెస్కు ఓటుతోనే బుద్ద్ధిచెప్పాలని మంత్రి తన్నీరు హరీశ్రావు రైతులకు పిలుపునిచ్చారు.సంగమేశ్వర ఎత్తిపోత్తల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు జహీరాబాద్కు తీసుకువచ్చి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. గోదావరి నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతామని చెప్పారు. ‘రిస్కు వద్దు..కారుకే ఓటు గుద్దు’ అని రైతులకు మంత్రి పిలుపునిచ్చారు.