ఝరాసంగం, జూలై 16: ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని, అర్హులు తమ వివరాలను సర్ ఫారంలో పూరించి సంబంధిత బీఎల్వోలకు అందజేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన తమ కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన సర్ ఫారాలను సంబంధిత అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశం, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు జగదీశ్, సర్పంచ్లు వినోద-బాల్రాజ్, రాజు, శివమణి, రాజ్కుమార్, నాగేందర్, సోహేల్, నాయకులు వెంకట్రెడ్డి, శశివర్ధన్రెడ్డి, బీఎల్వోలు, అధికారులు పాల్గొన్నారు.