సిద్దిపేట/జహీరాబాద్/గజ్వేల్, జనవరి 2 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాణిక్రావు కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో మాజీ మంత్రుల నివాసానికి వెళ్లి పలు విషయాలపై మాట్లాడినట్లు తెలిపారు. సిద్దిపేటలో ఆయా సంఘాల నాయకులు హరీశ్రావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు రంగాచారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హరీశ్రావును కలిశారు. నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామస్తులు రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి, నాయకులు సంపత్, సాయిలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.