రామచంద్రాపురం, డిసెంబర్ 8: మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్లోని సాయినగర్కాలనీ బస్డిపో రోడ్డులో రూ.24 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు సీసీ, బీటీ రోడ్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. బల్దియా పరిధిలోని సర్కిల్ 22లో పటాన్చెరు, ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్లు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ అభివృద్ధిలో రాజీ పడకుండా పనిచేస్తున్నామన్నారు. డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, అశ్విన్గౌడ్, లక్ష్మణ్యాదవ్, పెంటారెడ్డి, రాజనర్సింహ, మురళీధర్, సత్తయ్యగౌడ్, రవీకిరణ్గౌడ్, పండరి తదితరులు పాల్గొన్నారు.