పటాన్చెరు, డిసెంబర్ 22 : క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వ హించారు. ఈ సందర్భం గా పలు చర్చీల ఫాదర్లు క్రిస్మస్ కేక్లను కట్చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యే గూ డెం మహిపాల్రెడ్డి క్రైస్తవులకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. తెలంగాణలో అన్ని మ తాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, క్రిస్మస్ పండుగను అధికారింగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
పేద క్రిస్టియన్ సోదరుల సంక్షేమానికి అండగా ఉంటున్నామన్నారు. నియోజకవర్గంలోని క్రిస్టియన్ల కోసం క్రైస్తవ భవన్ను రూ. 2 కోట్లతో నిర్మిస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వంతో చర్చించి అతి త్వరలోనే శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తామని చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా పాత చర్చీలకు అందించే నిధులతో పాటు తాను రూ. 10 లక్షలు అందజేస్తానని ప్రకటించారు. ఈ వేడుకల్లో కళాబృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి రూ. 50 వేలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీలు సుష్మాశ్రీ, ప్రవీణ, దేవానందం, కుమార్ గౌడ్, జడ్పీటీసీలు సుప్రజ, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మ న్లు లలితా, కొలన్ రోజా, కార్పొరేటర్లు మెట్టు కుమార్, సింధు, పుష్ప, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు చంద్రారెడ్డి, అఫ్జల్, షేక్ హుస్సే న్, ఈర్లరాజు, నాయకులు కొలన్బాల్రెడ్డి, ఆదర్శ్రెడ్డి, నగేశ్, దశరథ్రెడ్డి, వెంకట్రెడ్డి, పాస్టర్ల సంఘం అధ్యక్షుడు ప్రశాంత్, చర్చీల పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.