కౌడిపల్లి : వానకాలం వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కౌడిపల్లి మండలంలోని తునికి, వెంకట్రావ్పేట్, ముట్రాజ్పల్లి, వెంకటాపూర్(ఆర్), తిమ్మాపూర్, రాయిలాపూర్, నాగ్సాన్పల్లి, మహ్మద్నగర్, పాంపల్లి, ధర్మసాగర్, కంచన్పల్లి, కొట్టాల, వెల్మకన్నె, కౌడిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గింజను ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతులు కొనుగోలు కేంద్రాలకు సహకరించాలన్నారు. యాసంగి సీజన్లో మాత్రం రైతులు ప్రత్యామ్నాయ పంటలను పండించుకోవాలన్నారు.
వాణిజ్య పంటలతో అధిక లాభాలు ఉన్నాయని, రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.