‘ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్, బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. వారి విష ప్రచారాలను నమ్మొద్దు. రైతులకు నేనున్నానని సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం కింద అందజేసే రైతుబంధును కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవాలని కొర్రీలు పెట్టారు. రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ను ఈ ఎన్నికల్లో బొందపెట్టాలి’.. అని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం శివ్వంపేట మండలంలోఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నేనున్నానని సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం కింద అందజేసే రైతుబంధును కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవాలని కొర్రీలు పెట్టారు. రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ను ఈ ఎన్నికల్లో బొందపెట్టాలి’.. శివ్వంపేట, నవంబర్ 27: రైతులకు నేనున్నానని సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం కింద అందజేసే రైతుబంధును కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని, రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ను ఈ ఎన్నికల్లో బొందపెట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. సోమవారం శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్ల, తిమ్మాపూర్, గూడురు, శివ్వంపేట, ఏదుల్లాపూర్, చండి, గంగాయిపల్లి, బిజిలీపూర్, సికింద్లాపూర్, గోమారం, లచ్చిరెడ్డిగూడెం, నవాబ్పేట, పెద్దగొట్టిముక్ల, చెన్నాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలసి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని కాంగ్రెస్, బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ విష ప్రచారాలను నమ్మొద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏకంగా రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తమని భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు.
రైతులెవరూ భయపడొద్దని మనందరికీ కేసీఆర్ అండగా ఉన్నారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రైతుల బోరు మోటర్లకు మీటర్లు పెట్టాలని సీఎం కేసీఆర్పై ఒత్తిడి తెస్తున్నదని, అయినా కేసీఆర్ రైతులపై భారం పడొద్దని మీటర్లు పెట్టనని కరాఖండిగా చెప్పారని గుర్తుచేశారు. ఓడిపోతున్నామనే భయంతో కాంగ్రెస్, బీజేపీలు మరింత విష ప్రచారాలు చేస్తారని వాటిని ప్రజలు నమ్మొద్దన్నారు. అందరి దీవెనలతో తాను భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ పదేండ్ల కాలం నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని పథకాలు సైతం ప్రజల శ్రేయస్సు కోసం అందించిన విషయాన్ని గుర్తుచేశారు. మూడోసారి గెలిస్తే అందించే పథకాలు ప్రజలకు వివరించారు. సౌభాగ్యలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.3వేలు, రూ.400కే సిలిండర్, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం, రైతుబంధు ఎకరాకు రూ.16వేలు, పింఛన్ నెలకు రూ.5వేలు, కేసీఆర్ బీమా కింద అకాల మరణం చెందిన వారికి రూ.5లక్షల బీమా అందజేయనున్నట్లు తెలిపారు. వీటన్నింటిని ప్రజలు మనసులో పెట్టుకుని కారు గుర్తుకు ఓటెయ్యాలని సూచించారు.
గ్రామాల్లో ఘన స్వాగతాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. గ్రామాల్లోకి రాగానే భాజాభంత్రీలు, డప్పుచప్పుళ్లు, పూలు, పటాకులు, మంగళహారతులు ఇస్తూ ఘన స్వాగతం పలకడం విశేషం. ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో బీఆర్ఎస్ నాయకుల్లో మరింత జోష్ పెరిగింది. శివ్వంపేటలో జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో భారీ గజమాల వేసి డీజే పాటలతో ఘన స్వాగతం పలికారు. యువకుల డ్యాన్సులతో శివ్వంపేట మార్మోగింది. ప్రచారంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, వైస్ ఎంపీపీ రమాకాంత్రెడ్డి, సర్పంచ్లు కల్లూరి కీర్తన హనుమంతరావు, లావణ్యామాధవరెడ్డి, పత్రాల శ్రీనివాస్గౌడ్, బాలమణి నరేందర్, స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్గౌడ్, అనూష అశోక్గౌడ్, చిట్యాల లక్ష్మీపోచయ్య, చంద్రకళ శ్రీశైలంయాదవ్, ఎంపీటీసీలు నువ్వుల దశరథ, మర్రి సత్తిరెడ్డి, నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు కృష్ణారావు, బండారి గంగాధర్, యాదాగౌడ్, శ్రీనివాస్గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.