శివ్వంపేట, ఆగస్టు 30 : సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఆసరా పింఛన్లతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. మంగళవారం శివ్వంపేట మండలం చండి ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక సీఎం కేసీఆర్ హయాంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని అన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీరు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్ వంటి పథకాలు దేశంలో ఏరాష్ట్రంలో లేవని, కేవలం సీఎం కేసీఆర్కే సాధ్యమైందని గుర్తుచేశారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా, జడ్పీ కోఆప్షన్ మన్సూర్, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి పాల్గొన్నారు.