తొగుట, ఫిబ్రవరి 29: కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. తొగుట వ్యవసాయ మార్కెట్లో గురువారం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందన్నారు. ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి మేడిగడ్డ ప్రాజెక్టు మీద కాంగ్రెస్ నాయకులు అవినీతి ఆరోపణలు చేయడం హేయనీయమన్నా రు. నేడు యాసంగి పంటలు ఎండిపోతున్నాయని, రాజకీయాలు పక్కన పెట్టి సాగునీళ్లు అందించి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ప్రజలను వివరించడానికే మేడిగడ్డ పర్యటన చేస్తున్నామన్నా రు. పొద్దుతిరుగుడు పంటను తొగుట వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చి మద్దతు ధర రూ.6760 పొందాలని రైతులకు సూచించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్య, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం క్రాంతి, సొసైటీ చైర్మన్ కె హరికృష్ణారెడ్డి, వైస్చైర్మన్ కుర్మ యాదగిరి, తహసీల్దార్ శ్రీకాంత్, మార్కెట్ కార్యదర్శి స్వామి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఎండీ కలీమోద్దీన్, ఎంపీటీసీలు సూతారి లలితా రమేశ్, వేల్పుల స్వామి, మండల యూత్ అధ్యక్షుడు మాదాసు అరుణ్కుమార్, నాయకులు సిరినేని గోవర్ధన్రెడ్డి, మాజీ మా ర్కెట్ చైర్మన్లు బక్క కనకయ్య, దొమల కొముర య్య, వైస్ చైర్మన్ కంది రాంరెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, కనకయ్య, వెంకటేశం, బైరాగౌడ్, పోచయ్య, రాజు, సుభాశ్గౌడ్, మంగ నరిసింహులు, అశోక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.