సిద్దిపేట, మార్చి 10( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాగునీరు విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లా రైతుల ప్రయోజనాల దృష్ట్యా కొన్ని ముఖ్యమైన అంశాలను లేఖలో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. యాసంగిలో రైతులు వేసిన వరి పంటలకు నీరులేక ఎండిపోతున్నాయని, సాగునీరందించి వారికి అండగా నిలవాలని లేఖలో పేరొన్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో సాగుచేస్తున్న యాసంగి పంటలు గట్టెక్కాలంటే వెంటనే సాగు నీరందించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన నాలుగేండ్లలో ముందస్తు ప్రణాళికతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా సాగునీటిని అందించిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో అలసత్వం వహిస్తున్నట్లు అర్థమవుతున్నదని లేఖలో పేర్కొన్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, కండ్లముందు ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, కొత్త బోర్లు వేయిస్తూ అప్పుల పాలవుతున్నాని, బావుల్లో పూడికతీత పనుల్లో రైతులు నిమగ్నమయ్యారని లేఖలో తెలిపారు.
ఈ దుస్థితిని అధిగమించాలంటే వెంటనే రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని కోరారు. నాలుగేళ్లు ఈ సమయంలో రంగనాయక సాగర్ నిండుకుండలా నీటితో కళకళలాడిందన్నారు. కానీ, ప్రస్తు తం నీళ్లు లేక రిజర్వాయర్ బోసిపోయి కనిపిస్తున్నదని హరీశ్రావు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి కూడా తక్షణమే నీటిని విడుదల చేయాలన్నారు. అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్లో టీఎంసీ నీటిని నిల్వ ఉంచాలని లేఖలో కోరారు. క్షేత్ర స్థాయిలో మీరు పరిశీలించి వాస్తవాలను గ్రహించాల్సిందిగా కోరుతున్నానని పేర్కొన్నారు. రాజకీయాలు కాకుండా రైతుల ప్రయోజనాలఫై దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు తగిన పరిషారం చూపించకుంటే త్వరలోనే రైతుల పక్షాన పోరాటాలకు సైతం సిద్ధమవుతామని, రైతులకు అండగా ఉంటానని లేఖలో మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.