సిద్దిపేట, ఫిబ్రవరి 23: ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం బాధాకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం ఉదయం మరణవార్త తెలుసుకున్న ఆయన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు దవాఖానకు చెరుకొని ఎమ్మెల్యే కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం కంటోన్మెంట్లో లాస్యనందిత నివాసానికి వెళ్లి ఆమె భౌతికాయాన్ని సందర్శించి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. లాస్యనందిత ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.