పటాన్చెరు, జనవరి 30: కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కార్ విద్యను అందజేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో రూ.కోటి 20లక్షలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం, రూ. 60లక్షలతో వీకర్సెక్షన్ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయంలో మన ఊరు- మన బడి పథకం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించుకున్నామన్నారు. పాఠశాలల్లో అత్యుత్తమమైన శిక్షణను అమలులోకి తీసుకొచ్చామన్నారు.
శిక్షణ పొందిన ఉపాధ్యాయులుండటంతో ఇంగ్ల్లిష్ మీడియం పాఠశాలలు సైతం ఉత్తమంగా ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోని పాఠశాలల్లో అద్భుతమైన వసతులను కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు తీసిపోని విధంగా తయారు చేశామన్నారు. బడుగు,బలహీన వర్గాల పిల్లలు చక్కగా చదువుకొని రాణించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి, గ్రామ సర్పంచ్ ధరణీఅంతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, అంతిరెడ్డి పాల్గొన్నారు.