పటాన్చెరు, డిసెంబర్ 10: ప్రజలకు ఉపయోగపడే పథకాలకు మద్దతు ఇస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి స్వ యంగా మహిళలతో పథకంపై మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు వినయోగించుకోవాలన్నారు. ఉచిత బస్సులతో మహిళలల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఇదే సమయంలో ఆటోవాలాకు గిరాకీ దెబ్బ తింటుందని గుర్తు చేశారు.
అనంతరం ఏరియా దవాఖానలో ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు కార్యక్రమం ప్రారంభించారు.
ఆరోగ్య శ్రీ పథకం ఇప్పుడు ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెరగడంతో ప్రజలకు ఆరోగ్య ధీమా ఏర్పడిందన్నారు. ప్రభుత్వా లు మారినంత మాత్రాన స్థానిక ప్రజాప్రతినిధులకు ఆలస్యంగా సమాచారం ఇవ్వడం తగదని ఆర్టీసీ అధికారులతో ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, డీఆర్డీఏపీడీ శ్రీనివాస్రావు, దవాఖాన సూపరింటెండెంట్ వసుంధర, ఎంపీపీలు సుష్మశ్రీవేణుగోపాల్రెడ్డి, ప్రవీణావిజయ్భాస్కర్రెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్రెడ్డి, కుమార్గౌడ్, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి , రోజా బాల్రెడ్డి, లలితాసోమిరెడ్డి, కార్పొరేటర్లు పుష్పానగేశ్, మెట్టు కుమార్యాదవ్, సింధుఆదర్శ్రెడ్డి పాల్గొన్నారు.