నర్సాపూర్, నవంబర్ 16: తెలంగాణ రాష్ర్టాన్ని యావత్ దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దుక్కుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండు సార్లు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు.
నర్సాపూర్ను ఎంతో అభివృద్ధి చేశానన్నారు. మంజీరా, హల్దీ వాగులపై 14 చెక్డ్యాంలు, బస్సుడిపో, ఫోర్లేన్ రోడ్డు తదితర అభివృద్ధి పనులు చేశామన్నారు. సీఎం కేసీఆర్ శిశ్యుడిగా మొదటి నుంచి పని చేశానని, ఆయన ఆదేశాల మేరకు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తానన్నారు. దౌల్తాబాద్, కాసాల గ్రామాలు మున్సిపాలిటీ కావాలని, రంగంపేట గ్రామాన్ని మండలంగా చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు.