టేక్మాల్, నవంబర్ 26 : కాంగ్రెస్కు ఓటు వేస్తే తెలంగాణ తెలంగాణ ప్రజలు కష్టాలపాలవుతారని అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఆదివారం మండలంలోని బొడగట్, సూరంపల్లి, చెరువుముందరి తండా, కమ్మరికత్త, షాబాద్ తండా, ఎల్లుపేట్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ వచ్చాక తెలంగాణ ప్రజల జీవన విధానం మారిందని, నాటి తెలంగాణకు నేటి తెలంగాణను చూసి ప్రజలు ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని, 5 హెచ్పీ మోటరు నుంచి 10 హెచ్పీ మోటరు రైతులు వాడాలని చెపుతున్న కాంగ్రెస్ కనీసం పొలాలకు సరిపడే కరెంట్ ఇవ్వకుండా,మోటర్లు మార్చమనడం సరికాదన్నారు.
భారీగా బీఆర్ఎస్లో చేరికలు
సందర్భంగా బోడగట్టు, సీఎం తాండ, కమ్మరికత్త, ఎల్పుగొండ, టేక్మాల్ కాంగ్రెస్ కార్యకర్తలు, వట్పల్లి మండలానికి చెందిన బిజిరిపురం గ్రామ కాంగ్రెస్ రైతులు బంగారు యాదయ్య, సుమారు 130 మంది బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచారంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాశ్, ఎంపీపీ చింత స్వప్నరవి, ఎంపీటీసీలు నారాయణ రెడ్డి, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు సాయిలు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శ్వేతా చంద్రశేఖర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముఖ్తార్, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీటీసీ చైర్మన్ బాలయ్య, మామిడి సుధాకర్ రెడ్డి, ఆయాగ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.