తూప్రాన్, ఏప్రిల్ 18 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మైనార్టీలకు తగిన గుర్తింపు లభించిందని, అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవించే ఏకైక పార్టీ బీర్ఎస్ అని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం తూప్రా న్ పట్టణంలోని ‘మజీద్-ఏ-సహేబా’లో ఏర్పా టు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా ఆయ న హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ఉపవాస దీక్షలో ఉం టూ, ఐదు దఫాలుగా ప్రార్థనలు నిర్వహించే పవిత్రమైన పండు గ రంజాన్ అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో పాల్గొనడం భగవంతుని కృపగా భావిస్తానన్నారు.
తొమ్మి ది సంవత్సరాల కాలంలో ఎ లాంటి ఇబ్బంది లేకుండా సర్వమత సామరస్యతను చాటేలా అన్ని కులాలు, మతాలకు ప్రాధాన్యత కల్పించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్సేనన్నారు. కార్యక్రమంలో మైనార్టీ పట్టణ అధ్యక్షుడు బురాన్, మండల పార్టీ అధ్యక్షుడు బాబుల్రెడ్డి, తూప్రాన్ పట్టణ అధ్యక్షుడు సతీశ్చారి, సర్పంచు ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు భగవాన్రెడ్డి, సర్పంచులు కత్తుల సత్యనారాయ ణ, వెంకట్రామ్రెడ్డి, రమేశ్, కౌన్సిలర్లు కొడిప్యాక నారాయణగుప్తా, రవీందర్రెడ్డి, నాయకులు బస్వన్నగారి సత్యనారాయణ గౌడ్, కృష్ణారెడ్డి, బజారు చక్రవర్తి, సత్తార్, కాశీ, అనిల్, అహ్మద్, అజర్, ఉమర్, నూరీ, షకీల్, పాల్గొన్నారు.