పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 22: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం జారి పడడంతో స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే అపోలో దవాఖానకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈటెల పరామర్శ హైదరాబాద్లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.