సంగారెడ్డి అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం కొండాపూర్ మండల నాయకుడు శ్రీకాంత్రెడ్డి, మల్కాపూర్ ఎంపీటీసీ శ్రీనివాస్గౌడ్లు హైదరాబాద్లో మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు వారితో మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే జరుగుతున్నదని, ఇకముందు కూడా బీఆర్ఎస్తోనే సాధ్యమని అన్నారు.
నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. చిన్నచిన్న సమస్యలుంటే పక్కన పెట్టి పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొండాపూర్ మండల నాయకుడు శ్రీకాంత్రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్గౌడ్లు మంత్రులతో మాట్లాడుతూ సంగారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం తాము చిత్తశుద్దితో పనిచేస్తామని, చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తామన్నారు. మంత్రులను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, జిల్లా నాయకుడు జైపాల్రెడ్డి ఉన్నారు.