కాంగ్రెస్ అంటేనే నాటకం, నయవంఛనకు కేరాఫ్ అడ్రస్ అని.. కేసీఆర్, బీఆర్ఎస్ అంటే విశ్వనీయత, నమ్మకానికి మారుపేరని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే ఝూఠా కోర్ మాటలు వింటే మోసపోతం, గోసపడ్తం.. చెవులతో విన్నది నమ్మకుండా.. కండ్లతో చూసి ఓటేయాలని మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం అందోల్ నియోజకర్గంలోని పోతులబోగుడ చౌరస్తాలోని పత్తి మిల్లు ప్రాంగణంలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నిర్వహించిన అలయ్బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఇంటి బిడ్డలా ఉంటాడన్నారు. ఆ మంచితనమే నేటి ఈ అశేష జనవాహినికి నిదర్శనమన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. పాలపిట్ట లాంటి మంచి మనసున్న సీఎం కేసీఆర్ స్వరాష్ర్టాన్ని సాధించి, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్వన్గా నిలబెట్టారన్నారు. కాంగ్రెస్ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యం పక్క రాష్ట్రం కర్ణాటక పరిస్థితులే నిదర్శమన్నారు. రైతుల కష్టాలు 60 ఏండ్ల పాలనలో ఏనాడూ గుర్తుకు రాలేదు. ఎన్నికలు రాగనే అబద్ధపు వాగ్దానాలతో రైతులను మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే సీఎం కేసీఆర్కు రైతుల అండ ఎల్లప్పుడు ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు బూటకపు మ్యానిఫెస్టోలతో రైతులను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో తపనపడే వ్యక్తి అని, ఈ ఐదేండ్లలో గ్రామాలను చాలా అభివృద్ధి చేశాడని, మరోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అందోల్, అక్టోబర్ 27: కాంగ్రెస్ అంటేనే నాటకం, నయవంచనకు కేరాఫ్ అడ్రస్ అని.. కేసీఆర్, బీఆర్ఎస్ అంటే విశ్వసనీయత, నమ్మకానికి మారుపేరని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే ఝూఠా మాటలింటే మోసపోతం, గొసపడ్తమని.. చెవులతో విన్నది నమ్మకుండా.. కండ్లతో చూసి ఓటేయాలని మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం పోతులబోగుడ చౌరస్తాలోని పత్తి మిల్లు ప్రాంగణంలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నిర్వహించిన అలయ్బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముం దుగా మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీజైపాల్ రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలయ్బలయ్ లాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలందిరినీ ఒకచోటకు చేర్చడంతో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అందరకీ పాతరోజులను గుర్తు చేశారన్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నియోజక వర్గం ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ.. ఇంటి బిడ్డాలా ఉంటాడని ఆ మంచి తనమే నేటి ఈ అశేష జనవాహినికి నిదర్శనమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అందోల్ నియోజకవర్గ అభివృద్ధికి క్రాంతికిరణ్ ఎంతో శ్రమిస్తున్నారన్నారు. పాలపిట్టలాంటి మంచి మనసున్న సీఎం కేసీఆర్ స్వరాష్ర్టాన్ని సాధించి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఎంతో కృషి చేస్తున్నారని… ఇప్పుడూ దేశ రాజకీయాల్లో సైతం క్రీయాశీలకం కానున్నారన్నారు. బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుందని బీజేపీకి దేశాన్ని పాలించే అర్హత లేదన్నారు. ఆనాడు తెలంగాణ కోసం 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి కేసీఆర్ ఢిల్ల్లీ మెడలు వంచి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పెత్తనం కోసం పాకులడుతుందని.. అలాంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేసి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
కాంగ్రెస్ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యం పక్క రాష్ట్రం కర్ణాటక పరిస్థితులే నిదర్శనమని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. రైతుల కష్టాలు 60 ఏండ్ల పాలనలో ఏనాడూ గుర్తుకు రాలేదు.. ఎన్నికలు రాగానే అబద్ధపు వాగ్ధానాలతో రైతులను మోసగించాలనే ప్రయత్నం చేస్తుందన్నారు. రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే సీఎం కేసీఆర్కు రైతుల అండా ఎల్లప్పుడు ఉంటుందని, ప్రతిపక్షాలు బుటకపు మ్యానిఫెస్టోలతో రైతులను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. గతంలో సింగూర్ అంటే జంటనగరాలకు పరిమితం చేశారని.. కానీ సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాకే పరిమితం చేసి రైతులకు రెండు పంటలకు సాగునీరందించి అండగా నిలిచారన్నారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో తపనపడే వ్యక్తి అని, ఈ ఐదేండ్లలో గ్రామాలను చాలా అభివృద్ధి చేశాడని, మరోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్ల్లీకి పంపించాలన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి మారుతి, ఎన్నికల నియోజక ఇన్చార్జ్జి ఫరూఖ్ హుస్సేన్, రాష్ట్ర నాయకుడు రాహుల్ కిరణ్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, సర్పంచ్ సురేఖాబుద్ధిరెడ్డి, ఎంపీటీసీ ఇందిరా, ఏఎంసీ చైర్మన్ రజినీకాంత్, ఎంపీపీలు కృష్ణవేణి, బాలయ్య, శైలజ, జడ్పీటీసీలు అపర్ణ, మీనాక్షి, మల్లికార్జున్, వరం చైర్మన్ వీరారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు అశోక్గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఎంతో మంచి మనస్సున్న వ్యక్తని ముందుచూపుతో 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని పదేండ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రాష్ట్రం అన్ని రం గాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎండిపోయిన చెరువులు, పొట్ట చేతబట్టుకుని వలస వెళ్లే కూలీలే దర్శనమిచ్చేవారన్నారు. కానీ స్వరాష్ట్రంలో అలుగులుపారుతున్న చెరువులు పచ్చని పంటలతో పొలాలు దర్శనమిస్తూ చేతినిండా పని దొరుకుతూ.. సంతోషంగా ఉన్నారన్నారు. ఇతర రాష్ర్టాలకు కూలీకి వెళ్లే తెలంగాణ బిడ్డలు సొంత రాష్ట్రంలో దర్జాగా బతుకుతూ పొరుగు రాష్ర్టాల వారికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారు. ఇదే కదా ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ అని ఆట, పాటల రూపంలో ప్రజలకు వివరించారు. – గోరటి వెంకన్న, ఎమ్మెల్సీ
వట్పల్లి, అక్టోబర్ 27: వట్పల్లి, అల్లాదుర్గం రోడ్డు గులాబీమయమైంది. శుక్రవారం పోతులబొగుడ చౌరస్తాలో అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ నిర్వహించగా కార్యక్రమానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరను హరీశ్రావు, ఎమ్మెల్సీ గొరెటి వెంకన్న, ఎంపీ బీబీపాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, స్టేట్ ట్రేడ్ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి తదితరులు హాజరయ్యారు. అందోల్, జోగిపేట మున్సిపాలిటీతో పాటు అందోల్, వట్పల్లి, అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్, పుల్కల్, చౌటకూర్, రాయికోడ్, మునిపల్లి మండలాల నుంచి పెద్దఎత్తున్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, పారీ శ్రేణులు హాజరయ్యారు. దీంతో వట్పల్లి-అల్లాదుర్గం ప్రధాన రహదారి మొత్తం గులాబీ వనమైంది. అలయ్బలయ్ సందర్భంగా రచయిత యశ్పాల్, గాయనీ రేలారే గంగా ఆటపాటలతో దుమ్ములేపారు. జబర్దస్ట్ ఆర్టిస్టులు జీవన్, రాము తదితరులు కమేడితో నవ్వించారు. ఆటపాటలతో ప్రాంగణం మార్మోగగా..ప్రభుత్వ పథకాలను పాటల రూపం లో వివరించడంతో పార్టీశ్రేణులు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.
అందరి సహకారంతో రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అలయ్బలయ్ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే మీ ఆదరాభిమానం నాపై ఇలాగే ఉండాలని, మీ అందరి ఆశీర్వాదం, కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఆశీస్సులతో గ్రామాల్లో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామంలో సైతం అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. – క్రాంతి కిరణ్, ఎమ్మెల్యే