కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్కు అధికారమిస్తే అక్కడ ఖజానా ఖాళీ అయిందని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మి ఆగం కావద్దని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్లో బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్షోలో ఎంపీ బీబీపాటిల్, మాజీ ఎమ్మెల్యే విజయపాల్రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలు ఏమో కానీ రాహుల్, ప్రియాంక జాడ మాత్రం కనపడడం లేదన్నారు. మూడు గంటల విద్యుత్తో మూడు ఎకరాలు పారుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, అవి అలాగే కొనసాగాలంటే నారాయణఖేడ్లో భూపాల్రెడ్డి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించామని చెప్పారు. తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి బీటీ రోడ్లు వేశామన్నారు. మున్సిపల్ పన్నులను తగ్గిస్తామని, అసైన్డ్ భూములకు పట్టా హక్కులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
నారాయణఖేడ్, నవంబర్ 24 : నారాయణఖేడ్ నియోజక వర్గంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పథ కాలు ఇలాగే కొనసాగాలంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్రెడ్డి గెలవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నారాయణఖేడ్లో మంత్రి హరీశ్రావు రోడ్ షో నిర్వహిచారు. రోడ్షోకు వచ్చిన ప్రజలనుద్దేశించి మంత్రి హారీశ్రావు ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో నా రాయణఖేడ్లో ప్రభుత్వ దవాఖానలు, విద్యాసంస్థలు మూ తపడి ప్రైవేట్ వైద్యశాలలు, కళాశాలలు కొనసాగిన పరిస్థితి ఉండేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానికంగా వంద పడకల దవాఖాన, డయాలసిస్ సెంటర్, డయాగ్నస్టిక్ సెంటర్, మాతాశిశు దవాఖాన, రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించామన్నారు. నాలుగు కొత్త మండలాలను ఏర్పాటు చేయడంతోపాటు నారాయణఖేడ్ను మున్సిపాలిటీగా మార్చడమే కాకుండా పట్టణాభివృద్ధికి రూ.50కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, రూ.110 కోట్లతో తండాల్లో బీటీ రోడ్లు వేయించామని గుర్తు చేశారు. ఇంటింటికీ మంచినీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులు తీర్చామన్నారు. మున్సిపల్ పన్నులను తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని తెలిపారు. అసైన్డ్ భూములకు పటా ఇస్తామన్నారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మొద్దని, ఈనెల 30వ తేదీన కారు గుర్తుకు ఓటేసి భూపాల్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెసోళ్ల దిమ్మదిరిగేలా చేయాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధికారం చేపట్టిన వెంటనే ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల కేసీఆర్ బీమా అమలు చేప్తామని ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమ లు చేస్తాన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మహారెడ్డి భూపాల్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ నేతలకు చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో తనపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారని, తాను ప్రభుత్వ భూములు కాపాడుతూ కాంగ్రెస్ కబ్జాకోరులకు సింహస్వ ప్నంగా ఉన్నానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. పేదల భూములతోపాటు రామాలయం, కాశీనాథ్ మందిర్, వక్ఫ్బోర్డు భూములను కాంగ్రెస్ నేతల చెర నుంచి తాను విడిపించానన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని భూపాల్రెడ్డి కోరారు.
ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ఒప్పంద కుట్రలను నమ్మి ప్రజలు మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి విజయపాల్రెడ్డి సూచించారు. ఓటు సంజీవ్రెడ్డికి వేసి పనుల కోసం సురేశ్శెట్కార్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని ఆరోపిం చారు. వారు స్వార్థం కోసమే కలిశారని, ప్రజల కోసం కాదనే విషయాన్ని గమనించాలని విజయపాల్రెడ్డి సూచించారు.