స్థలాన్ని పరిశీలించిన టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంగారెడ్డి, ఏప్రిల్ 5: తెలంగాణ రైతులు పండించిన ధాన్యం సేకరణకు కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంతో నిరసనలకు సీఎం కేసీఆర్ మేరకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ కలెక్టరేట్ ఎదుట నిరసనకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరవుతారని చింతా ప్రభాకర్ తెలిపారు.
మంగళవారం టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నిరసన స్థలాన్ని పరిశీలించారు. పార్టీ శ్రేణులు భారీగా తరలిరానుండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.