తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 15. బడుగు బలహీనవర్గాల గొంతుకగా ఎప్పటికీ ఉంటానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ గౌడ సంఘం, పీసీసీ కల్లుగీత సెల్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నం ప్రభాకర్ను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శుక్రవారం గౌడ సంఘాల నాయకులు ఆత్మీయ సత్కారం చేశారు. గౌడ సంఘం అధ్యక్షుడు కేశం నాగరాజు గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
ఐకమత్యంతో ఉంటే బీసీలు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. ముఖ్యంగా బీసీ కులగణన, జనగామ జిల్లాకు సర్దార్ పాపన్నగౌడ్ పేరు పెట్టే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్, మాజీ ఎమ్మెల్యే రాజలింగం, గౌడ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు శంబుల శ్రీకాంత్గౌడ్, గౌడ సంఘం కోశాధికారి హరిచరణ్గౌడ్ పాల్గొన్నారు.