జహీరాబాద్, ఏప్రిల్ 23: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్లో కొత్తగా ఎలక్ట్రిక్ బ్యాటరీల ప్లాంట్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి జహీరాబాద్కు సోమవారం 3 గంటలకు చేరుకుంటారు. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు.
పరోక్షంగా మరెంతో మంది ఉపాధి పొందుతున్నారు. జహీరాబాద్ మహీంద్రా డివిజనలో ట్రాక్టర్ ప్లాంట్, మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్లు రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేసే వాహనాలు ప్రపంచలోని పలు దేశాలకు పంపిస్తున్నా రు. ఇక్కడ ఉత్పత్తి చేసిన వాహనాలను గూడ్స్ రైలులో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కొత్త ప్లాంట్లో ఎలక్ట్రిక్ బ్యాటరీలు తయారు చేయడంతో ఎంతోమందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్లాంట్ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్తో పాటు మహీంద్రా ప్రతినిధులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు.