సిద్దిపేట, అక్టోబర్ 22 : ఎండాకాలాన్ని వానకాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆదివారం సిద్దిపేట కోమటి చెరువు వద్ద జరిగిన వేడుకల్లో తన సతీమణి శ్రీనితతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్న దన్నారు. ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వస్తున్నదని తెలిపారు. సమైక్య పాలనలో చెరువులు, కుంటల్లో బతుకమ్మలు నిమజ్జనం చేయడానికి నీళ్లు ఉండేవి కాదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో చెరువులు, కుంటలు నిండుకుండలా ఉన్నాయన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరుపుకొంటున్నారన్నారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రజల ఆశీస్సులతో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపారన్నారు. ప్రకృతి, పూలను పూజించే గొప్ప సంస్కృతి మనది అన్నారు. కోమటి చెరువు వద్ద మంత్రి ప్రజలతో వారు తెచ్చిన సద్దులు, ఫలహారాలు కలిసి ఆత్మీయతను పంచుకున్నారు.
జిల్లా ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు..
విజయ దశమి (దసరా) పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలని, తెలంగాణ ప్రజల జీవితంలో దసరాను మించిన పండుగ లేదన్నారు. దసరా పండుగలో మన సంప్రదాయం, సంస్కృతితోపాటు ఆత్మీయత ఉందన్నారు. ఈ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.