రామాయంపేట/ నిజాంపేట/ చేగుంట, ఫిబ్రవరి 18 : రామాయంపేట, నిజాంపేట, చేగుంట మండలాల్లో ఆదివారం మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పర్యటిస్తు న్నారు. రామాయంపేట మండలంలోని డి.ధర్మారం గ్రామం లో రూ.8 కోట్లతో పూర్తి చేసిన వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రారంభిస్తారని సర్పంచ్ బొడ్డు శంకర్ తెలిపారు. మంత్రి పర్యటన వివరాలను శనివారం ఆయన వివరించారు. ధర్మారం గ్రామంలో ఫంక్షన్ హాల్, మోడల్ పాఠశాల భవనంతోపాటు మినీ ట్యాంక్బండ్, సీసీ రోడ్లతోపాటు ఇతర అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామానికి వెళ్తారన్నారు. నార్లపూర్ చెరువులోకి రామాయంపేట కాలువ ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
డీ.ధర్మారం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్
రామాయంపేట మండలం డీ.ధర్మారం గ్రామంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి పరిశీలించారు. గ్రామంలోని ఫంక్షన్హాల్, మోడల్ పాఠశాల, మినీ ట్యాంకు బండ్ను పరిశీలించారు. వారి వెంట సర్పంచ్లు బొడ్డు శంకర్, శివ, నరేందర్రెడ్డి, కార్యదర్శి మహేందర్ ఉన్నారు.
నార్లాపూర్ చెరువుకు గోదావరి జలాలు
నిజాంపేట మండలంలోని నార్లాపూర్లో ఉన్న హైదర్ చెరువులోకి గోదావరి జలాలు రానున్నాయి. నీటిని విడుదల చేయ డానికి మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రానున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నుంచి రామాయంపేట కెనాల్ ద్వారా గోదావరి జలాలను నార్లాపూర్ చెరువలోకి విడుదల చేస్తారని వివరించారు. నార్లాపూర్ శివారులోని రామాయంపేట కెనాల్తోపాటు సమావేశ స్థలాన్ని అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డితో కలిసి పరిశీలించారు. వారి వెంట ఎంపీపీ సిద్ధిరాములు, కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ కొండల్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, సర్పంచ్ అమరసేనారెడ్డి, తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్, మాజీ ఎంపీపీ సంపత్, చల్మెడ ఎంపీటీసీ బాల్రెడ్డి, నాయకులు అనిల్, యాదగిరి, ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.
మల్లన్నసాగర్ జలాలు విడుదల
చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ కెనాల్ వద్ద మల్లన్నసాగర్ జలాలను మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డి విడుదల చేస్తారని కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇఫ్కో డైరెక్టర్ తెలి పారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను వారు పరిశీలించారు. కా ర్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నేత రంగయ్యగారి రాజిరెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాడెం వెంగళ్రావు, సర్పంచ్లు శ్రీనివాస్, రాములు, నాయకులు పట్నం తానీషా, బాపురెడ్డి, వడ్డెపల్లి నర్సింహులు, రమేశ్ ఉన్నారు.