సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 30 : ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సెప్టెంబర్ 1న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్స్లో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా వరి ధాన్యానికి సంబంధించి పీఏసీఎస్, ఐకేపీలకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం 11.15 గంటలకు కొత్తగా మంజూరైన డిజిటల్ కార్డ్స్, పింఛన్ మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందజేస్తారు. సంగారెడ్డి, కంది, కొండాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు సదాశివపేట మండలంలోని నందికందిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, మధ్యాహ్నం ఒంటి గంటకు సదాశివపేటలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 1.15 గంటలకు నీటి ట్యాంకు, మహిళా భవనాలకు ప్రారంభోత్సవం, 1.30 గంటలకు సదాశివపేట పట్టణంలోని బాలాజీ గార్డెన్స్లో సదాశివపేట పట్టణం, గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన డిజిటల్ కార్డ్స్, పింఛన్ పత్రాలు లబ్ధిదారులకు అందజేస్తారని కలెక్టర్ వివరించారు.