‘మీరే నా బలం..బలగం.. మీ ఆశీస్సులు ఉన్నంత కాలం సేవ చేస్తూనే ఉంటా. ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసి ఇచ్చే సంక్షేమ ప్రభుత్వం మనది’..అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం నారాయణరావుపేట మండలంలోని మల్యాల, మాటిండ్ల, జక్కాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో అందరి ఆత్మగౌరవం పెరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో బోర్లు వేసి నీళ్లు పడక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఆ బాధలు తీరాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండుటెండల్లో చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయని గుర్తుచేశారు. రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. పక్క రాష్ర్టాల్లో కరెంట్ కష్టాలుంటే.. తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామన్నారు. దేశంలోనే బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
-నారాయణరావుపేట, జూన్ 1
నారాయణరావుపేట, జూన్ 1 : ‘మీరే నా బలం.. బలగం.. మీ కోసం ఇంకా కష్టపడుతా..మీ ఆశీస్సులు, దీవెనలు ఉన్నంత కాలం సేవ చేస్తా.. కాంగ్రెస్ హయాంలో బోర్లు వేసిన నీళ్లు పడక బాధపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ఆ బాధ తప్పింది.. ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసే సంక్షేమ ప్రభుత్వం మనది’ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మండలంలోని మల్యాలలో గురువారం జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి మంత్రి బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి పూలమాల వేశారు. గ్రామంలోని ఫంక్షన్ హాల్, లైబ్రరీ, అంగన్వాడీ భవనం, శ్మశానవాటిక, ఎస్సీ కాలనీలో ఓహెచ్ఎస్ఆర్, ఓపెన్జిమ్, చిన్నారులకు ఆటస్థలం, డ్రైనేజీ, నాగలింగేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో పెండ్లి ఎదుర్కోళ్ల తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గ్రామస్తుల సహకారంతో మల్యా లకు రాష్ట్రస్థాయి అవార్డు వచ్చిందని శుభాకాంక్షలు తెలియజేశారు. గల్లీగల్లీలో సీసీ రోడ్లు వేసుకున్నామన్నారు. కాళేశ్వరం నీళ్లతో మండుటెండల్లో చెరువులు నిండుకుండల్లా తలపిస్తున్నాయన్నారు. రూ.200 పింఛన్ రూ.2,016 చేశామని, మరో వారం రోజుల్లో గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తామని తెలిపారు. గతంలో బోరుబావులు తవ్వి డబ్బులు వృథా చేసుకున్నారని, ఇవాళ కాళేశ్వరం నీటితో రెండు పంటలు పండిచుకుంటున్నామన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఎరువుల కొరత ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతుల కోసం 24గంటల నిరంతర విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామన్నారు. రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మొదటి విడతలో 40, 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. లైబ్రరీకి వారంలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. గ్రామంలో 808 మంది రైతులకు రైతుబంధు, వివిధ కారణాలతో మృతిచెందిన 14 మంది రైతు కుటుంబాలకు రైతుబీమా ఇచ్చి ఆదుకున్నామన్నారు. గ్రామంలో ఇటీవల శిక్షణ పొందిన 21మందికి కుట్టుమిషన్లు అందిస్తామన్నారు. అంతకు ముందు 30రోజుల ప్రణాళికతో మంత్రి సహకారంతో మల్యాల గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని, ప్రజాప్రతినిధులు వివరించారు. గ్రామంలో 18రకాల అభివృద్ధి పనులు చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జక్కాపూర్లో రైతుబజా రు, విలేజ్ ఫంక్షన్ హాల్, చర్చిలను ప్రారంభించారు. గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలకృష్ణ, వైస్ ఎంపీపీ సంతోశ్కుమార్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఆంజనేయులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దండు స్వప్న ప్రభాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లయ్య, సర్పంచులు దరిపల్లి వజ్రవ్వ, దుర్గం పరశురాములు, కొంగరి నారాయణ, ఎంపీటీసీలు హరీశ్, భాను ఉన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కారు కాదు.. ఆయిల్ ఇంజిన్ సర్కారు
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో వ్యవసా యానికి 7 గంటల కరెంట్ ఇస్తే, తెలంగాణలో 24గంటలు ఉచిత కరెంట్ అందిస్తున్నామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రైతులకు కరెంట్ను అందించలేక 20లక్షల ఆయిల్ ఇంజిన్లను నడిపిస్తున్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. మాటిండ్లలో 20 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించారు. మాటిండ్ల మధిర శేఖర్రావుపేట, బంజేరుపల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించి మంత్రి మాట్లాడారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాందేడ్ ప్రాంతాల్లో ఆరు రోజులకోకసారి తాగునీరు వస్తున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారన్నారు. కానీ, సీఎం కేసీఆర్ పుణ్యమాని తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా నిత్యం మంచినీరు వస్తున్నదన్నారు. దేశంలో 16 రాష్ర్టాల్లో మహిళలు బీడీలు చేస్తున్నారని, అక్కడి ప్రభుత్వాలు వారికి రూపాయి సాయం చేయ డం లేదన్నారు.
దేశంలో బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. మండుటెండల్లో నక్కవాగు చెరువు నిండుగా ఉందన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. గ్రామానికి చెందిన నర్సింహులు కుం టకు నీళ్లు రావాలంటే కాల్వలు తవ్వాలన్నారు. ఇందుకోసం గ్రామస్తులు సహకారాన్ని అందించాలని కోరారు. వర్షం కురిస్తే మాటిండ్లకు రావాలంటే నక్కవాగు దారి ఉండేది కాదని, నక్కవాగు పక్కన చెరువు, మాటిండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 35 బోర్లు వేసిన చుక్కనీరు రాలేదన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ, కాళేశ్వరంతో తాగు, సాగునీరు గోస తీరిందన్నారు. మాటిండ్ల విద్యుత్ సబ్స్టేషన్ కోరిక నెరవేరిందన్నారు. దర్గాకు మెట్లు, శేఖర్రావుపేటకు ఫంక్షన్ హాల్, రూ.3.80కోట్లతో జిల్లెల వరకు రోడ్డు సౌక ర్యం, బీసీ కమ్యూనిటీహాల్, మహిళా మండలి భవనం ప్రారంభాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.