మెదక్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలకు వివరించడంలో ఎలాంటి లోటుపాట్లకు తావు ఉండకూడదని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు స్పష్టం చేశారు. అభివృద్ధిని కండ్లకు కట్టినట్లు చూపేలా చకటి కార్యాచరణతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మెదక్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్తో కలిసి కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల నోడల్ అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 21 రోజులపాటు రోజుకో కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించిందని చెప్పారు. తమ శాఖ ఇచ్చే ఆదేశాలతోపాటు కార్యక్రమ షెడ్యూల్ ప్రకారం 2014కు పూర్వం ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై నియోజకవర్గం, మండలం, గ్రామం వారీగా వెంటనే నివేదిక అందజేయాలని సూచించారు.
కార్యక్రమాల షెడ్యూల్ ఇలా…
జూన్ 2న జిల్లా ఇన్చార్జి మంత్రి చిన్న శంకరంపేటలో అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిషరిస్తారని తెలిపారు. అక్కడే ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా స్టాల్స్, సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 3న అన్ని రైతు వేదికల్లో వేడుకలు జరపాలని, ఇందులో వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల విశిష్టతను తెలపాలన్నారు. 4న సురక్షా దినోత్సవంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్ మునిసిపాలిటీల్లో ర్యాలీలు నిర్వహించి శాంతిభద్రతల కోసం పోలీసులు చేస్తున్న కృషి, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని వివరించాలని తెలిపారు. జూన్ 5న విద్యుత్ రంగంలో సాధించిన గుణాత్మక మార్పులపై తెలంగాణ విద్యుత్ విజయోత్సవం నిర్వహించాలన్నారు. జూన్ 6న పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో తెలంగాణ పారిశ్రామిక ప్రగతిపై సభలు నిర్వహించి, టీఎస్ ఐపాస్, పరిశ్రమల స్థాపన, అనుమతులు సులభతరమైన విషయాలను తెలియజేయాలని సూచించారు.
జూన్ 7వ సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ సాగునీటి దినోత్సవం సభలు నిర్వహించాలన్నారు. జూన్ 8న ఊరూరా చెరువుల పండుగ పేర చెరువు కట్టలపై సభలు, బతుకమ్మ పండుగ నిర్వహించాలని తెలిపారు. జూన్ 9న తెలంగాణ సంక్షేమ సంబురాల్లో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అందించిన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర అంశాలతోపాటు 2వ విడత గొర్రెల పంపిణీ, వివిధ గ్రామీణ వృత్తి పనుల వారికి ఆర్థిక ప్రేరణ కింద రూ.లక్ష పంపిణీ చేపట్టాలన్నారు. జూన్ 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవంలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు, మండలాలు మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్ల వివరాలు, ధరణి సౌలభ్యంపై వివరించాలని తెలిపారు. జూన్ 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం నాడు జిల్లా స్థాయిలో తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా కవి సమ్మేళనం నిర్వహించాలని చెప్పారు.
జూన్ 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో తెలంగాణ రన్ నిర్వహించాలని తెలిపారు. జూన్ 13న తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం నాడు నియోజకవర్గం కేంద్రంలో మహిళా సదస్సు నిర్వహించాలన్నారు. జూన్ 14న తెలంగాణ వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించి, ఆ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని తెలియజెప్పాలన్నారు. జూన్ 15న తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించాలని, ప్రతి గ్రామ పంచాయతీ వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. జూన్ 16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహించి సఫాయీ కార్మికులను సన్మానించాలన్నారు. మున్సిపాలిటీల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. జూన్ 17న తెలంగాణ గిరిజనోత్సవం నాడు గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహించాలని, గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించాలన్నారు.
జూన్ 18న తెలంగాణ మంచినీళ్ల పండుగ కార్యక్రమం ద్వారా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధమైన తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లపై అవగాహన కల్పించాలన్నారు. జూన్ 19న అన్ని గ్రామాలు, పట్టణాల్లో మొకలు నాటే కార్యక్రమం నిర్వహించాలన్నారు. జూన్ 20న విద్యా దినోత్సవం నిర్వహించి, మన ఊరు-మన బడి కింద సిద్ధమైన పాఠశాలలతోపాటు గ్రంథాలయాలు, డిజిటల్ క్లాస్ రూమ్లను ప్రారంభించాలని సూచించారు. విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించాలని తెలిపారు. జూన్ 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించాలని, ఆలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలకు అలంకరణ, ప్రముఖ క్షేత్రాల్లో ప్రత్యేక భక్తి, సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. చివరగా జూన్ 22న అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని, గ్రామ పంచాయతీల్లో ఉదయం 11 గంటలకు సమావేశం కావాలని, అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించాలని కలెక్టర్ వివరించారు.
నేడు మంత్రి హరీశ్రావు సమీక్ష…
ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఆదివారం మెదక్లో సమీక్షించనున్నారు. శనివారం జరిగిన సమీక్షలో జిల్లా అధికారులు వెంకట శైలేశ్, చందూనాయక్, ఏసయ్య, సత్యనారాయణ రెడ్డి, జయరాజ్, కృష్ణమూర్తి, ఖాసీం, రవిప్రసాద్, విజయశేఖర్రెడ్డి, భీమయ్య, రాధాకిషన్, రాజిరెడ్డి, రాజేంద్రప్రసాద్, కమలాకర్, శ్రీనివాస్, నాగరాజ్, ఆశాకుమారి, బ్రహ్మాజి, రజిని, ఇందిర, ఆర్డీవో సాయిరాం, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.