‘కాంగ్రెస్కు అధికారమిచ్చిన కర్ణాటక ప్రజల్లాగా తెలంగాణ జనం ఆగంకావొద్దు’.. అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండల కేంద్రాల్లో మంగళవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్కు మద్దతుగా నిర్వహించిన రోడ్షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఏమో కానీ ఆరునెలలకు ఒక ముఖ్యమంత్రి మారుతారని ఎద్దేవా చేశారు. మూడు గంటల విద్యుత్తో మూడు ఎకరాలు పారుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్కుమార్రెడ్డి అంటున్నాడని, అలాంటి వారి మాటలు నమ్మి ఓట్లు వేస్తే మోసపోవడం ఖాయమని, ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి
కారు గుర్తుకు వేయాలని కోరారు.
కోహెడ, నవంబర్ 21: బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి, సంక్షేమం అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ ల మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం కోహెడలో హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి చేపట్టిన రోడ్షోకు కోహెడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంత్రి హరీశ్రావు, సతీశ్కుమార్లపై పూల వర్షం కురిపించారు. మహిళలు తిలకం దిద్దుతూ స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా అందిం చి భరోసాగా నిలిచిందన్నారు. సాగు, తాగు నీరు, రోడ్లు, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు తదితర పథకాలతో ప్రజల మనసులు గెలుచుకున్నదన్నారు. మళ్లీ కారు గుర్తుకు ఓటు వేసి సతీశ్కుమార్ను ఆశీర్వదిస్తే పెండింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు. హుస్నాబాద్లో ఆర్డీవో, విద్యుత్ కార్యాలయాలతోపాటు ఐవోసీ కార్యాలయం, 100 పడకల దవాఖానను నిర్మించినట్లు తెలిపారు. సర్పంచ్లకు, ఎంపీటీసీల సమక్షంలో గ్రామాల్లో రోడ్లు వేశామన్నారు. శనిగరం ప్రాజెక్ట్కు రూ.23 కోట్లు, సింగరాయ ప్రాజెక్ట్కు రూ.5 కోట్లు మంజూరు చేయించి మరమ్మతులు చేసినట్లు పేర్కొన్నారు.
మోయతుమ్మెద వాగుపై 8చెక్డ్యాంలను నిర్మించినట్లు చెప్పారు. కరోన సమయంలో కాంగ్రెస్ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరినీ కాపాడుకున్నామన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో వస్తున్నదని, నమ్మి మోసపోవద్దని కోరారు. కాంగ్రెస్ మూడు గంటలు, బీజేపీ 5గంటలు కరెంట్ ఇస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మి ఓటెయ్యొద్దని కోరారు. అనంతరం ఏఐఎస్బీ రాష్ట్ర కార్యదర్శి గవ్వ వంశీధర్రెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 200 మందికి మంత్రి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ నాగరాజు శ్యామల, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్, నాయకులు పేర్యాల రవీందర్రావు, ఫ్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్రావు, సర్పంచ్ పేర్యాల నవ్య, నాయకులు కొక్కు ల సురేశ్, నాగరాజు మధుసుదన్రావు, అబ్దుల్ రహీం, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.