రామాయంపేట, అక్టోబర్ 16: సీఎం ప్రత్యేక కార్యదర్శి పెంటపర్తి రాజశేఖర్రెడ్డి మాతృమూర్తి రత్నమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని దవాఖానకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సోమవారం దివంగత పెంటపర్తి రత్నమ్మ (80) పార్ధీవదేహాన్ని మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలోని వారి స్వగృహానికి తీసుకొచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కలిసి రత్నమ్మ భర్త పెంటపర్తి లక్ష్మారెడ్డి, కుమారుడు రాజశేఖర్రెడ్డి, వారి కుటుంబాన్ని పరామర్శించారు. రత్నమ్మ పార్ధీవదేహానికి పుష్పగుచ్చాలు సమర్పించి, నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, ఐజీ కమలాసన్రెడ్డితోపాటు పలువురు అధికారులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. చుట్టుపక్కల గ్రామాల వారు భారీ సంఖ్యలో డి.ధర్మారం చేరుకుని రత్నమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.