‘ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫలితాలు మెరుగయ్యాయి.. ఇది ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేట్ స్థాయి విద్యకు నిదర్శనం. ఇది మనందరి సమష్టి కృషితోనే ఎస్సెస్సీలో ఇంత మంచి ఫలితాలు సాధించగలిగాం. ఈ విజయంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు’… అని ఆరిక్థ, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆయన శనివారం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి ఈ సందర్భంగా పదో తరగతి ఫలితాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ కప్ క్రీడాపోటీల నిర్వహణ, ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై కలెక్టర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు.
సంగారెడ్డి, మే 13: ‘ప్రభుత్వ పాఠాశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫలితాలు మెరుగయ్యాయి.. ఇది ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేట్ స్థాయి విద్యకు నిదర్శనం. ఇది మనందరి సమష్టి కృషితోనే ఎస్సెస్సీలో ఇంత మంచి ఫలితాలు సాధించగలిగాం. ఈ విజయంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు’… అని ఆరిక్థ, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పదో తరగతి ఫలితాలలో సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు మరోసారి తమ సత్తాచారని, వరుసగా రెండోసారి మూడోస్థానంలో నిలవడం గొప్ప విషయమని మంత్రి అభినందించారు. ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో 147 ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించిగా, రెండు మండలాలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు. ప్రభుత్వ పాఠశాలో చదివిన 110 విద్యార్థులకు 10 జీపీఏ వచ్చాయని, ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగాలన్నారు. పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, స్నాక్స్తో ఎంతో ప్రయోజనం చేకూరిందని, మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. జిల్లాను మూడో స్థానంలో నిలపడంలో ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉందని, ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వ పాఠాశాలల్లో రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఫలితాలు మెరుగయ్యాయని, ఇది ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేట్ విద్యకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. త్వరలో 10 తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు వందశాతం ఫలితాలు సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అభినందన సభ ఏర్పాటు చేయాలని కలెక్టర్కు సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కప్ క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని, యువతకు చదువుతోపాటు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని మంత్రి గుర్తుచేశారు. మండల స్థాయిలో ఈ నెల 15 నుంచి 17 వరకు, 22 నుంచి 24 వరకు జిల్లా స్థాయిలో నిర్వహించే సీఎం కప్ క్రీడా పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. తాను జిల్లా స్థాయి టోర్నీలో పాల్గొంటానని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు యువతను భాగస్వామ్యం చేయడంలో చొరవ చూపాలన్నారు. గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సహించేందుకు సీఎం కప్-2023 క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టిందన్నారు. మూడు రోజుల పాటు వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తుండగా, వాటిని విజయవంతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. మండల స్థాయిలో రాణించిన వారిని జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసే అవకాశం ఉండడంతో తమ ప్రతిభను చాటేందుకు యువతకు అవకాశమివ్వాలన్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో సీఎం కప్ టోర్నీలు మండల స్థాయిలో జరుగనున్నాయన్నారు. ఇందులో భాగంగా అథ్లెటిక్స్, పుట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అంశాల్లో పోటీలు నిర్వహిస్తారని, మండల స్థాయిలో గెలుపొందిన జట్లను జిల్లా పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. మండల స్థాయిలో పోటీల నిర్వహణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ఎంపీపీ చైర్మన్గా, ఎంపీడీవో కన్వీనరుగా, జడ్పీటీసీ, తహసీల్దార్, ఎంఈవో, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఎస్సై, పీఈటీలు సభ్యులుగా కమిటీ చేయాలని, యూత్ను కూడా ఈ కమిటీలో చేసుకోవాలన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ టోర్నమెంట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇందులో రాణించే క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయని, మండలంలోని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించి సత్తా చాటాలని మంత్రి పిలుపునిచ్చారు. అట్టహాసంగా సీఎం కప్ను నిర్వహించాలని బ్యాన్సర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం క్రీడా పోటీల గురించి ప్రచారం బాగా చేయాలని, యువతను భాగస్వామ్యం చేస్తూ ప్రారంభానికి ముందు ర్యాలీలు నిర్వహించాలని మంత్రి కోరారు. ధాన్య కొనుగోలు కేంద్రాలను జిల్లాలో అనుకున్నన్ని ప్రారంభం చేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాక్ షీట్లను వెంటనే రైస్ మిల్లులకు పంపించి త్వరగా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, కలెక్టర్ శరత్కుమార్, ఎంపీలు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, డీసీఎంఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్, అదనపు కలెక్టర్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, డీఈవో, జడ్పీ హెచ్ఎంలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.