పట్టుదల, ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం తథ్యం
ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి
ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం
విద్యాక్షేత్రంగా సిద్దిపేట
ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్, విపంచి కళానిలయంలో విద్యార్థులకు
ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ
పోటీ పరీక్షల అభ్యర్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని బీసీ స్టడీ సర్కిల్లో గ్రూపు-1, ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు, జిల్లా వ్యాప్తంగా ఉచిత పోలీస్ శిక్షణ తీసుకుంటున్న 1162 మంది అభ్యర్థులకు విపంచి కళానిలయంలో ఆదివారం ఉచితంగా ఆయన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్దిపేటను విద్యాక్షేత్రంగా తయారు చేశామన్నారు. విద్యార్థులు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉద్యోగాల్లో 95శాతం రిజర్వేషన్లు కల్పించార న్నారు. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ప్రైవేట్ పాఠశాల లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
సిద్దిపేట, జూన్ 26 : ‘విద్యార్థులు పట్టదల, ఆత్మవిశ్వాసంతో చదివి అవకాశాలను అందిపుచ్చుకుని విజయం సాధించాలి’ ఇందుకోసం విద్యార్థులు నిరంతర శ్రమ, ప్రణాళికాబద్ధంగా చదవాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేట పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రూప్-1కు 200మంది, ఎస్సై, కానిస్టేబుల్కు 100 మంది శిక్షణ పొందుతున్నారన్నారు. విద్యార్థులు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిద్దిపేటలోని ఇందిరానగర్ పాఠశాలలో నాలుగేండ్లుగా అడ్మిషన్లు ఫుల్ అనే బోర్డు కనిసిస్తున్నదన్నారు. ప్రైవేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు చూస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభు త్వ పనితీరుకు నిదర్శనన్నారు. సిద్దిపేటను నేడు విద్యాక్షేత్రంగా తయారు చేశామన్నారు. బీసీ స్టడీ సర్కిల్లో చదివిన 318 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. మరికొంత మంది కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం పొందారన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్లు స్థానికులకే కల్పించారన్నారు. 91000 ఉద్యోగాలు భర్తీచేయనున్నట్లు తెలిపారు. దశలవారీగా ఉద్యో గ నోటిపికేషన్లు జారీ చేశామన్నారు.
ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగం రానివారు అధైర్య పడకుండా ముం దుకు సాగాలన్నారు. కార్పొరేట్, సాప్ట్వేరు రంగంలో ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తానని తెలిపారు. విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి టోపెల్, జీఆర్టీ కోచింగ్ ఇప్పించి, వీసా ప్రాసెస్ చేయించి విదేశాలకు పంపిస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం లేదని, కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామన్నారు. విద్యార్థులు ఊరు వదిలితే కసితో చదివి ఉద్యోగాలు పొందుతారన్నారు. ప్రైవేట్ రంగంలో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయని, అందుకు విద్యార్థులకు అవసరమైన స్కిల్స్ను పెంచుకునేందుకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్కు శాశ్వత భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉద్యోగాలు సాధించి సిద్దిపేట, తల్లిదండ్రులకు పేరు తీసుకురాలన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈ డీ సరోజ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ దయాసాగర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కనుకరాజు, నాయకులు పాల సాయి రాం, కౌన్సిలర్లు పూర్ణిమాఎల్లం, నాయకం లక్ష్మ ణ్, సాయికుమార్, అరవింద్రెడ్డి, రేణుకా తిరుమల్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు సత్తయ్య, టీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్రెడ్డి, పట్టణ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మహిపాల్గౌడ్, సిబ్బంది శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.