సిద్దిపేట, ఏప్రిల్ 16: “సీఎం కేసీఆర్ పరిపాలన దేశానికి రోల్మోడల్గా నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక రాష్ట్ర జేడీఎస్ నేత సయ్యద్ ఇబ్రహీం, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తున్నదన్నారు. కర్ణాటక రాష్ట్రం లో జరిగే ఎన్నికల్లో ప్రచారం చేస్తామన్నారు.సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో అనూహ్య స్పందన వస్తున్నదన్నారు. దేశంలోని అనేక రాష్ర్టాల్లో తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. నేడు కర్ణాటకలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు భయపడే పరిస్థితి ఉందన్నారు. సిద్దిపేటను అభివృద్ధిలో ఒక మోడల్గా నిలిపామన్నారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ర్టాల ప్రతినిధులు వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్నారన్నారు. అన్నివర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు సాగునీరు అందించామన్నారు. స్వచ్ఛబడి, కోమటి చెరువు ఆభివృద్ధి, డబుల్బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇచ్చామన్నారు.
సీఎం కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శం
సీఎం కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శమని కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక రాష్ట్ర జేడీఎస్ నేత సయ్యద్ ఇబ్రహీం అన్నా రు. వచ్చే ఎన్నికల్లో మంత్రి హరీశ్రావును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కర్ణాటకలో కుమారస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని, అందుకు సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారన్నారు. 34 ఏండ్లకే నా కొడుకును హస్నాబాద్కు ఎమ్మెల్యే చేశానన్నారు. ఢిల్లీలో తెలుగువ్యక్తి జెండాను ఎగురవేసే సమయం ఆసన్నమైందని,అది కేసీఆర్తోనే సాధ్యమన్నారు. హరీశ్రావు లాంటి గొప్ప నాయకుడు దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. బీదర్కు కూడా హరీశ్రావు సేవలు అందించాలన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు కర్ణాటకలో కుమారస్వామి నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం నాడు చౌదరి చరణ్సింగ్లాగా నేడు సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలోమున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, నాయకులు నయ్యర్ పటేల్, అక్తర్ పటేల్, ఇర్షాద్ హుస్సేన్, సజ్జు, జావిద్, వహిద్ఖాన్, వజీర్,మొయిజ్, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి, మచ్చ వేణుగోపాల్రెడ్డి, సాయిరామ్, శ్రీనివాస్గౌడ్, ముస్లిం మత పెద్దలు, తంజీమ్ ప్రతినిధులు, ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు.
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్త్తార్ విందులు
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్విందులని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల ముస్లింలకు కుకునూరుపల్లిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందించేందుకు ఇఫ్తార్ విందులు దోహదపడుతాయన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, అల్లా దయతో ప్రజాలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సీఎం కేసీఆర్ ముస్లింలకు షాదీముబారక్, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, రంజాన్ కానుకగా దుస్తులు పంపిణీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 408 మైనార్టీ గురుకుల పాఠశాలలను నెలకొల్పిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.