న్యాల్కల్, డిసెంబర్ 27: మండలంలోని రేజింతల్ సిద్ధివినాయక స్వామి అలయాభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హారీశ్రావు అన్నారు. ఆలయ ప్రాంగణంలో డీఎంఎఫ్టీ పథకం కింద రూ. 2కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. మూడు రాష్ర్టాల భక్తుల కోరిన కోర్కెలు తీర్చుతూ కొంగుబంగారంగా మారిన సిద్ధివినాయక స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చెంది, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని మొక్కుకున్నానని తెలిపారు.
ఇప్పటికే ఆలయాభివృద్ధికి రూ. 2కోట్లను మంజూరు చేశామన్నారు. ఈ నిధులతో ఆలయ ముఖద్వారం నుంచి ఆలయం వరకు ఫ్లాట్ఫాం, సెంట్రల్ లైటింగ్, మురుగు కాల్వలు, సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో షెడ్, ఫ్లోరిం గ్ తదితర పనులు చేపడతామన్నారు. ఆల య కమిటీ సభ్యుల వినతి మేరకు భక్తుల సౌకర్యార్థం కాటేజీలు, ఇతర వసతులు కల్పిస్తామన్నా రు.
కార్యక్రమంలో రాష్ట్ర చేనేత సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు రాజార్షిషా, వీరారెడ్డి, ఆర్డీవో రమేశ్బాబు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీసీఎంఎస్ చైర్మ న్ శివకుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్, పీఆర్ఈఈ జగదీశ్వర్, ఏడీ ప్రవీణ్కుమార్, ఏఈ కృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈలు ప్రసన్నకుమార్,సాబేర్ హుస్సేన్, ఏఈ అంగత్కుమార్, ట్రాన్స్కో డీఈఈ లక్ష్మినారాయణ, ఏడీ అప్పలనాయుడు, ఏఈలు అశ్వనీ, మహేశ్, జడ్పీటీసీ స్వప్నకుమారి, ఎంపీపీ అంజమ్మ, బీఆర్ఎస్ జిల్లా నాయకులు తనీర్ హైమద్, నామ రవికిర ణ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, నాయకులు భాస్కర్, పాండురంగారెడ్డి, నర్సింహారెడ్డి, పాండురంగారావు పాటిల్, భూమరెడ్డి, రాజేందర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, శివస్వామి, గౌసొద్దీన్, నిరంజన్రెడ్డి, ఎంపీటీసీలు దేవేట్టిపాటిల్, చంద్రన్న, సర్పంచులు కుతూబోద్ధీన్, ఫీటర్రాజ్, రవికుమార్, చంద్రన్న, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు అల్లా డి వీరేశం, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రేజింతల్ అశోక్, అల్లాడి నర్సింలు పాల్గొన్నారు.