బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 23 వరకు చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాలను అట్టహాసంగా నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా కోఆర్డినేటర్లు, ప్రజాప్రతినిధులతో సమావేశమై సమ్మేళనాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ,మండల, జిల్లా స్థాయిల్లో సమ్మేళనాలు ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేయాలని సూచించారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. సమావేశాల్లో నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించి తనకు తెలియజేయాలన్నారు. ఏప్రిల్లో జరిగే పార్టీ ఆవిర్భావ సమావేశాన్ని సైతం విజయవంతం చేయాలన్నారు.
సంగారెడ్డి, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 23వరకు సంగారెడ్డి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో ఎంపీ, ఎమ్మెల్యేలతో మంత్రి హరీశ్రావు సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 22 నుంచి గ్రామ, మండల, జిల్లాస్థాయి లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పది గ్రామాలను యూనిట్గా తీసుకుని నెల రోజుల పాటు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. మండలస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొనేలా చూడాలన్నారు. సర్పంచ్లు, బీఆర్ఎస్ కమిటీ నాయకులు, సొ సైటీ సభ్యులు, రైతుబంధు సమితి కమిటీ సభ్యులు ఆత్మీ య సమ్మేళనాల్లో భాగస్వాములను చేయాలని సూచిం చారు. మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న వారిని కలుపుకుని ముందుకు పోవాలని సూచించారు. సమావేశాల్లో పార్టీ నాయకులు, ముఖ్యు లు ఇచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకుపోవడ మే కాకుండాప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ బలోపేతానికి ఆత్మీయ సమ్మేళనాలను వేదికగా మలుచుకోవాలన్నా రు. నెల రోజులపాటు నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాల ను ప్రజాప్రతినిధులు, నాయకులు కుటుంబ సభ్యులుగా కలిసి ఆత్మీయంగా నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని సమావేశంలో వచ్చిన సూచనలు, సలహాలను తన దృష్టికి తేవాలని మంత్రి హరీశ్రావు సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఎమ్మెల్యేలు ముందుకు సాగాలని ఆదేశించారు. ఏప్రిల్లో జరిగే పార్టీ ఆవిర్భావ సమావేశాన్ని సైతం విజయవంతం చేయాలన్నారు. నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి విజయవంతం చేస్తామని ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సమావేశంలో సంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, గూడెం మహిపాల్రెడ్డి, భూపాల్రెడ్డి, మాణిక్యరావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మెదక్ జిల్లా కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొన్నారు.