టేక్మాల్, ఏప్రిల్ 7: రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని షాహెదుల్ల దర్గాలో మండల కో ఆప్షన్ సభ్యుడు మజహర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు.
దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఉపవాసాలు చేపట్టిన ముస్లింలతో దీక్షలు విరమింపజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మ రమేశ్, నాయకులు మాన్ కిషన్, పాపయ్య, సాగర్, భక్తుల కిశోర్, అనిల్, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.