తాడ్వాయి, జనవరి 31 : వనదేవతలు మేడా రం సమ్మక్క, సారలమ్మ మినీ జాతరకు వేళయిం ది. రెండేండ్లకోసారి జరిగే మహాజాతర తర్వాత ఫిబ్రవరిలో వచ్చే మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని నేడు (బుధవారం) సమ్మక్క, సారలమ్మ పూజా మందిరాల్లో పూజారులు నిర్వహించే మండమెలిగే పండుగతో జాతర మొదలవుతుంది. తల్లులను గద్దెలపైకి తీసుకురావడం మినహా అమ్మవార్లను జరిగే పూజలన్నీ యథావిధిగా కొనసాగనున్నాయి. నాలుగు రోజుల పాటు జాతర కొనసాగన్నది. తల్లుల దర్శనానికి సుమా రు 5లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, రోడ్లు తదితర సౌకర్యాల కోసం కలెక్టర్ రూ.2.82 కోట్లు మం జూరు చేయగా, వివిధ శాఖల అధికారులు పను లు పూర్తి చేశారు.
మేడారంలో నేడు సమ్మక్క-సారక్క పూజారులు మండమెలిగే పండగ మినీ జాతరను నిర్వహించనున్నారు. ప్రతి రెండేండ్లకోసారి జరిగే మహాజాతర తర్వాత వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మేడారంలో సమ్మక్క పూజారులు, కన్నెపల్లిలో సారక్క పూజారులు ఆయా పూజా మందిరాల్లో మండమెలిగే పండుగ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పూజారులు ఆయా గ్రామాల్లో గ్రామదేవతలు, బొడ్రాయిల వద్ద ప్రత్యేక పూజలు చేస్తా రు. అనంతరం దుష్టశక్తులు గ్రామంలోకి రాకుం డా పూజారులు బురుకు కట్టెలతో గ్రామ పొలిమేరలో మామిడి ఆకులతో పాటు కోడిపిల్లను కట్టి తోరణాలు కడతారు. పూజారులతో పాటు వారి కుటుంబసభ్యులు, బంధువులు సమ్మక్క-సారలమ్మ పూజామందిరాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. మినీజాతర ముగిసే దాకా అమ్మవార్లకు సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కిష్ణయ్య, కన్నెపల్లిలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అత్యంత నియమనిష్టలతో పూజలు నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి తల్లుల పూజారులు రాత్రంతా గద్దెల వద్ద జాగారం చేసి ఒకరికినొకరు సాకను ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో మినీజాతర ప్రారంభమవుతుంది. బుధ, గురు, శుక్రవారాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్న తర్వాత పూజా సామగ్రిని శుద్ధి చేసి గుడిలో భద్రపర్చడంతో మినీజాతర ముగుస్తుంది.
భక్తులకు సకల సౌకర్యాలు
భక్తులకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.82 కోట్లు మంజూరు చేయగా, కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో అన్ని శాఖలు సకల సదుపాయాలు కల్పించారు. నాలుగు విడిది గృహాలకు మరమ్మతులు చేసి భక్తులకు అందుబాటులో ఉం చారు. 50మంది ఎంపీవోలు, 100 మంది పం చాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తించనున్నా రు. భక్తులు స్నానాలు చేసేందుకు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ను ఏర్పాటు చేశారు. జంపన్నవాగుపై జంట వంతెనలకు ఒకవైపు రూ.11.70 లక్షలతో ఏర్పాట్లు పూర్తి చేశారు. స్నానఘట్టాలపై 350కి పైగా షవర్లను బిగించారు. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు రేకులతో తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు గద్దెలపై చలువ పందిళ్లు వేశారు. గద్దెల పరిసరాలు, సాలహారాన్ని విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గద్దెల పరిసరాల్లో మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. విధుల్లో ఉన్న అధికారులకు భోజన సదుపాయాలు కల్పించారు. నాలుగు రోజుల పాటు నిరంతరం కరెంట్ ఉండేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా అవసరమైన చోట్ల జాతర పరిరాలతో పాటు గద్దెల పరిసరాల్లో ట్రాఫిక్, ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా చెక్పోస్టులను ఏర్పా టు చేశారు. గద్దెల వద్ద ఔట్పోస్టును ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో భక్తులకు సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. టీటీటీ కల్యాణ మండపంలో ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేశా రు. రూ.10 లక్షల విలువైన వివిధ రకాల మందులతో పాటు 50వేల మాస్క్లు అందుబాటులో ఉంచారు. రోజుకు నలుగురు వైద్యాధికారులతో 10 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు.