గజ్వేల్,జూలై 8 : ఎంపీపీలకు చెక్ పవర్ కల్పిస్తూ జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ ఎంపీపీ దాసరి అమరావతి శ్యాంమనోహర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎంపీపీలు తదితరులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణలోని గ్రామాలు, మండలాలను మరింత అభివృద్ధి చేయడానికి ఎంపీపీలకు చెక్ పవర్ ఇవ్వడంపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జడ్పీటీసీ పంగమల్లేశం, వైస్ఎంపీపీ కృష్ణగౌడ్, ఆయా మండలాల ఎంపీపీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.