రామాయంపేట, మే 05 : విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగాలంటే మంచి చదువులు చదివితేనే ముందుకు వెళ్తారని రామాయంపేట మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ బాలికల ఉన్న పాఠశాలలో జరుగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఆట పాటలు, కథలు, వివిధ క్రీడల్లో నైపుణ్యం సాధించాలని, అప్పుడే సమాజంలో పేరు ప్రతిష్టలు దక్కుతాయన్నారు.
విద్యార్ధులకు 15రోజుల పాటు వేసవి శిక్షణలు ఉంటాయన్నారు. శిక్షణలో భాగంగా ఉపన్యాస, వ్యాసరచన పోటీలలో పాల్గొనేలా శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి రోజు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఉదయం 8గంటల నుండి 11గంటల వరకు శిక్షణ ఉంటందన్నారు. అనంతరం 11గంటలకు విద్యార్థులకు స్నాక్సును అందించి ఇంటికి పంపిస్తామని తెలిపారు.