మెదక్ : సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవడానికి మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెలా 2, 16వ తేదీల్లో మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు.
ముఖ్యంగా రెవెన్యూ, బీడీ కార్మికుల పింఛన్లు, భూముల, అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని ఇలా వివిధ రకాల సమస్యలు వస్తున్నాయని, వీటిని వెంటనే ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రతి నెలా నిర్వహిస్తున్న మీ కోసం నేనున్నా కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తుందన్నారు.
కార్యక్రమం లో ఆర్డీవో సాయిరాం, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్, వసంత్రాజ్, హవేళీఘణాపూర్, పాపన్న పేట మండలాల వైస్ ఎంపీపీ రాధాకృష్ణ, విష్ణువర్ధన్రెడ్డి, మెదక్ మండల పార్టీ అధ్యక్షుడు అంజాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, జయరాం రెడ్డి, బాలాగౌడ్, సాంబశివరావు, సాప సాయిలు, శ్రీనివాస్, నియోజకవర్గ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.