మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో భువన్ సర్వే ప్రారంభమైంది. భవనాల వివరాలను ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ సాయంతో భువన్ యాప్లో పొందు పరిచేందుకు క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణ ఆప్లోడ్ బాధ్యతలను మున్సిపల్ బిల్ కలెక్టర్లకు అప్పగించడంతో గత రెండు రోజులుగా పట్టణంలో 5 టీమ్లతో మున్సిపల్ బిల్ కలెక్టర్లు సర్వే చేపట్టారు.
ఇంటి కొలతలు సరి చూసి భువన్ యాప్లో పొందు పరుస్తున్నారు. ఇస్రో, సీడీఎంఏ సంయుక్త ఆద్వర్యంలో ఈ యాప్ రూపొందించగా వాస్తవానికి గతేడాది జూలై, ఆగష్టులోనే ఈ సర్వే నిర్వహించారు.కొవిడ్ కారణంగా వాయిదా వేశారు. అసెస్మెంట్లను మ్యాపింగ్ చేసి ఆదాయం సుకూర్చునేలా చర్యలు తీసుకోవాలని సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ
గత నెల 24న కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేయడంతో మరోసారి సర్వే చేస్తున్నారు. భవనాల వివరాలను ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ సాయంతో యాప్లో పొందుపరుస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ ఆప్లోడ్ బాధ్యతలను బిల్ కలెక్టర్లకు అప్పజెప్పారు.