మెదక్ అర్బన్, డిసెంబర్ 8: ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేయాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల్లో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల గురించి జిల్లా సిబ్బందికి ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఏదైనా కేసు నమోదు అయితే తర్వాత ఆ కేసుకు సంంబంధించిన దర్యాప్తును నేర పరిశోధనాధికారి ఏ విధంగా చట్టపరమైన అంశాలను సిబ్బందికి వివరించి, పలు సూచనలు చేయనున్నట్లు తెలిపారు.
పెండింగ్లో ఉన్న కేసుల్లో గ్రేవ్, నాన్గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మెడికల్ సర్టిఫికెట్ను సేకరించి కేసులు ఛేదించి శిక్షల శాతం పెంచాలని అన్నారు. సమన్స్, వారెంట్ ఎగ్జిక్యూటివ్స్ చేయాలని, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి దరఖాస్తును ప్రాపర్గా ఎంక్వైరీ చేసి, ఎంక్వైరీ రిపోర్టును ఆైన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను ఎప్పటికపుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ సైదులు, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.