మెదక్, జూలై 15: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలు, పడకల సంఖ్య పెంచుతూ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఒకప్పుడు సీమాంధ్రుల పాలనలో ‘నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు’.. అంటూ పాటలు పాడుకున్న ప్రజలే, ఇప్పుడు ‘వెళ్తే సర్కారు దవాఖానకే వెళ్తాం’.. అనేలా ప్రభుత్వ వైద్యం ప్రజలకు దగ్గరయ్యింది.
మెదక్ జిల్లా కేంద్రంలో అన్ని వసతులతో ఏర్పాటు చేసిన మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఇటీవల ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించారు. శుక్రవారం దవాఖానకు గర్భిణులు, రోగులు పెద్ద సంఖ్యలో వచ్చి వివిధ రకాల టెస్టులు, వైద్యం చేయించుకున్నారు. ప్రైవేట్కు దీటుగా సర్కారు వైద్యం అందుతుండడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.