నిజాంపేట, సెప్టెంబర్ 13 : సీఎం కేసీఆర్ సమర్థవంతంగా అమ లుచేస్తున్న దళితబంధు పథకంతో దళితులు ఆర్థిక పురోగతిని సాధిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నిజాంపేట మండలం నగరం గ్రామానికి చెందిన 43 మంది దళిత కుటుంబాలకు దళితబంధుకు ఎం పిక చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ గేమ్సింగ్తో కలిసి గురువారం ఎమ్మెల్యేను హై దరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు.
అనంతరం గ్రామానికి వచ్చిన తర్వా త సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో ఎంపీపీ సిద్ధిరాములు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, నాయకులు రవి, ఉప్పలయ్య, దళితబంధు పథకం లబ్ధిదారులు ఉన్నారు.