సంగారెడ్డి, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): ప్రభు త్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, సీడీపీఓలు, సూపర్వైజర్లు, వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఒక్కో పీహెచ్సీ వారీగా సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ పని తీరులో వెనుకబడి ఉన్న వారిని హె చ్చరించారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తం గా పీహెచ్సీ వారీగా ఎన్ని కాన్పులు జరిగాయి, అందులో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో జరిగినవెన్ని వివరాలను ఆరా తీశారు. కనీసం 80శాతం డెలివరీలు ప్రభుత్వ దవా ఖానల్లోనే జరిగేలా పక్కాగా పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. మహిళాలు గర్భం దాల్చిన నాటి నుంచి కాన్పు అయ్యేంత వరకు ఆమె ఆరోగ్య పరిరక్షణపై ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు సమన్వ యం చేసుకోవాలని సూచించారు.
ప్రతి గర్భిణికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని హెచ్చరించారు. గర్భిణీల్లో రక్త హీనత లేకుండా చూడాలన్నారు. ప్రసవం జరిగిన వెంటనే కేసీఆర్ కిట్ ఇవ్వాలని సూచించారు. నాణ్యమైన సేవలందిస్తూ ప్రభుత్వ దవాఖాన పని తీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందిస్తే నూటికి నూరు శాతం గర్భిణులు ప్రభుత్వ దవా ఖానల్లోనే కాన్పు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతార న్నారు. జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ పంపిణీలో వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు, ఏఎన్ఎంలు అంగన్వా డీ, ఆశ కార్యకర్తలందరూ కష్టపడ్డారని, వారందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
బూస్టర్ డోస్ 95శాతం పూర్తయ్యిందని, మిగిలిన ఐదు శాతాన్ని పూర్తి చేయాలని కోరారు. నాన్ కమ్యూనికల్ డిసీజెస్ స్క్రీనింగ్ పూర్తి చేయడంపై మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బయో మెడికల్ వెస్టేజ్ నిర్వాహణ బాగుండాలన్నారు. ఫార్మసీ రిజీస్టర్లు ల్యాబ్ నిర్వహణ బాగుండేలా చూసుకోవాలని సూచించారు. గర్భిణులను దవా ఖానకు తీసుకొ చ్చే ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ కార్యకర్తల కోసం ఆయా దవాఖానల్లో ఒక గదిని ఏర్పాటు చేయాలని, వారికి సహకరించాలని డాక్టర్లకు సూచించారు.
గర్భిణులకు సంబంధించిన అన్ని విషయాలపై దృష్టి సారించాలని, వందశాతం ప్రసవాలు ప్రభుత్వ దవా ఖానల్లో జరిగేలా చూడాలని, అందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా పని చేసినప్పుడే విజయవంతం అవుతామన్నారు. ప్రతి వారం తాను వైద్య శాఖ పనితీరు పై సమీక్ష నిర్వహిస్తానని, పనితీరు మెరుగు పర్చుకొని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీఎం అండ్హెచ్వో డాక్టర్ గాయత్రీదేవి, డీసీహెచ్ఎస్ సంగారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, మెడికల్ ఆఫీసర్లు, ఏరియా దవాఖా నల సూపరింటెండెంట్లు, మెడికల్ సూపర్వైజర్లు, సీడీపీవో లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.