ములుగు, ఫిబ్రవరి 7 : ఎవరికీ ఏ ఆపదొచ్చినా.. ఆదుకుంటూ వారికి అండగా నిలిచే ము లుగు మండలం లక్ష్మక్కపల్లికి చెందిన మున్నూరు వెంకయ్య కనిష్ఠ పుత్రుడే విష్ణుజగతి. తండ్రి బాటలో నడవాలనే సదుద్దేశంతో 2009లో తన సేవలకు పునాదిగా వీపీజే ఫౌండేషన్, శ్రేయోభిలాషులు సంస్థ్ధలను స్థాపించి నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే పేద విద్యార్థ్ధులకు పుస్తకాలతో మొదలుకొని దుస్తులు, బూట్లు, బెంచీలు తదితర అవసరాలను రోటరీక్లబ్ ఆఫ్ సహకారంతో అందించాడు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థ్ధులకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు వాటర్ ప్లాంట్ను రోటరీ క్లబ్ ద్వారా ఏర్పాటుచేసి విద్యార్థులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. సుమారు రూ. 10లక్షలతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులను ఆయన సమకూర్చారు. అలాగే గ్రామీణ ప్రాంతాల విద్యార్థ్ధుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు వివిధ పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న భయాన్ని తొలిగించేందుకు ప్రేరణ పేరిట అవగాహన సదస్సు నిర్వహించి, ఎంతో మంది విద్యార్థ్ధుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. 50 మంది సభ్యులతో శ్రేయోభిలాషులు సంస్థను ఏర్పాటు చేసి కరోనా సమయంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో నిరుపేదలకు, వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారి ఆకలిని తీర్చారు.
ముఖ్యమంత్రిచే అభినందనలు
విష్ణుజగతి చేసిన సామాజిక సేవలను మెచ్చి స్వయంగా సీఎం కేసీఆర్ అభినందించారు. సామాజి సేవలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయా సందర్భాల్లో మంత్రివర్యులు హరీశ్రావు, జగదీశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు, మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, డీజీపీ మహేందర్రెడ్డి, అడిషనల్ డీజీపీ జితేందర్, సుధీర్బాబు, అంజనీ కుమార్, సుమతి ఆయా సందర్భాల్లో విష్ణుజగతిని ప్రత్యేకంగా అభినందించారు. ములుగు మండలం వంటిమామిడిలో మార్కెట్ యార్డులో గల బంగారు మైసమ్మ గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి మొదటి అభిషేకం సీఎం కేసీఆర్ పేరుతో చేయించారు. కేసీఆర్ చేపట్టనున్న ప్రతి పని విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, చండీయాగం, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీనరసింహాయాగం నిర్వహించినట్లు విష్ణుజగతి తెలిపారు.
సేవా కార్యక్రమాలు
తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రూ. 8 లక్షలతో రోటరీక్లబ్ ద్వారా యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు.
స్వగ్రామమైన లక్ష్మక్కపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రూ.4లక్షలు వెచ్చించి ఆట వస్తువులు,మౌలిక వసతులు కల్పించారు.
రోటరీక్లబ్ ద్వారా నియోజకవర్గంలోని పలు పాఠశాలలో నీటిశుద్ధి యంత్రాలను, బెంచీలను అందజేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రన్ పేరిట యువకులకు టీషర్టులు పంపిణీ చేసి వారిలో ఉద్యమస్ఫూర్తిని నింపారు.
రోడ్డు భద్రత వారోత్సవాల్లో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు పల్స్పోలియో నివారణకు కృషి చేశారు.
‘అబాకస్’పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయులకు కిట్లు పంపిణీ చేసి 3 రోజలు శిక్షణనిప్పించారు.
ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు హైదరాబాద్ నార్త్జోన్, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో పోలీస్లతో యువకులకు క్రీడాపోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సిద్దిపేట జిల్లా వంటిమామిడిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్వయంగా సీఎం కేసీఆర్ విచ్చేసి విష్ణుజగతిని అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 15 వేల మంది విద్యార్థులకు సొంత డబ్బు వెచ్చించి బూట్లు పంపిణీ చేశారు.
కరోనా సమయంలో ‘శ్రేయోభిలాషులు’ అనే సంస్థను ఏర్పాటు చేసి నిరుపేదలకు, వలస కూలీలకు నిత్యావసర సరుకులు పం పిణీ చేసి ఎంతో మంది పేదల ఆకలి తీర్చారు. అది గుర్తించిన మంత్రి తన్నీరు హరీశ్రావు సేవా శిరోమణి అవార్డుతో విష్ణుజగతని సత్కరించారు.
సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే సేవలు
నా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, సీఎం కేసీఆర్ స్ఫూర్తితో సామాజిక సేవలు అందిస్తున్నా. ఆర్థ్ధికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబాలకు విద్యార్థులకు భవిష్యత్తులో మరిన్ని సేవలు అంది స్తా. ఉన్నత చదువులు చదువలేని నిరుపేద విద్యార్థ్ధులకు ఆర్థిక సహకారం అందించి వారిని ప్రోత్సాహించడంలో ఎల్లప్పుడూ ముందుంటా.
– విష్ణుజగతి, వీపీజే ఫౌండేషన్ చైర్మన్